కలెక్టర్‌ సమక్షంలో బహిరంగ విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ సమక్షంలో బహిరంగ విచారణ చేయాలి

Jun 14 2025 7:21 AM | Updated on Jun 14 2025 7:21 AM

కలెక్టర్‌ సమక్షంలో బహిరంగ విచారణ చేయాలి

కలెక్టర్‌ సమక్షంలో బహిరంగ విచారణ చేయాలి

చింతపల్లి: ఆదివాసీ ట్రస్టు పేరిట మోసపోయిన బాధితులకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ వారికి న్యాయం చేయాలని గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్‌, ట్రస్టు బాధితులు సంఘం జిల్లా నాయకుడు చిక్కుడు అశోక్‌ డిమాండ్‌ చేశారు. చింతపల్లి సమీపంలో గల అంతర్ల గ్రామంలో ఆదివాసీ ట్రస్టు ప్రధాన కార్యాలయం ఎదుట ట్రస్టు బాధిత సభ్యులతో శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇటీవల ట్రస్టు చైర్మన్‌ చేసిన మోసానికి బాధితులు ధర్నా, ర్యాలీలు కార్యక్రమాలను చేపట్టి కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించారన్నారు. దీంలో శుక్రవారం విచారణ బృందం కేవలం చైర్మన్‌ బాలంపడాల్‌ తో పాటు 11మంది ట్రస్టు సభ్యులతో మాత్రమే విచారణ చేపట్టడాన్ని తప్పు పడుతున్నామన్నారు. కేవలం ఒక ఐడికి 12,200లతో నెలకు 3వేలు చొప్పున జీవిత కాలం చెల్లిస్తానని నమ్మబలకడంతో ఎంతో మంది గిరిజనులు తమకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులను అమ్మి ఈ ట్రస్టుకు లక్షలాది రూపాయలు చెల్లించారన్నారు. ఇదే విషయమై అనేక సమావేశాలలో బహిరంగంగానే ప్రకటించారన్నారు. ట్రస్టు చైర్మ్‌న్‌ చేసిన మోసాన్ని పరిగనణలోనికి తీసుకుని పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.కిందిస్థాయి ఉద్యోగులతో కాకుండా చింతపల్లి కేంద్రంగా కలక్టర్‌ సమక్షంలో విచారణ చేపడితే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేకుంటే ట్రస్టు బాధితులతో కలసి కలక్టరేట్‌ను ముట్టడిస్తాయని హెచ్చరించారు. ట్రస్టు వైస్‌ చైర్మన్‌ కయ్యం చిన్నబ్బాయి, పంచాయతీ కార్యదర్శి వండలం బాలయ్య, గిరిజన సంఘం నాయకులు ధనుంజయ్‌, చిరంజీవి, సత్యనారాయణ, రాంబాబు, విష్ణుమూర్తి, ట్రస్టు బాధితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement