
కిరండూల్ సెక్షన్లో రైల్వే జీఎం పర్యటన
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ శుక్రవారం రాయగడ డివిజన్ రైల్వే మేనేజర్ అబితాబ్ సింఘాల్తో కలసి కిరండూల్ సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్భంగా దమన్జోడి–కిరండూల్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ట్రాఫిక్, ప్రయాణికుల సదుపాయాలను జీఎం పరిశీలించారు. దమన్జోడి, జగదల్పూర్, కిరండూల్ స్టేషన్లు, రైల్వే కాలనీల్లో పర్యటించారు. అక్కడ ఆధునికీకరించిన ప్రయాణికుల సౌకార్యలను పరిశీలించారు. ప్రయాణికుల సలహాలు, అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం విండో ట్రయలింగ్ తనిఖీల ద్వారా డబ్లింగ్ పనులు, మలుపులు, వంతెనలు, టన్నెల్స్, వివిధ భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటనలో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారం, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బి.ఎస్.రాజకుమార్, చీఫ్ ట్రాక్ ఇంజినీర్ కె.ధనుంజయరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.