చింతూరు: చిన్నారులకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పాలని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సూచించారు. అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఎర్రంపేట–2 అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చిన్నారులకు అంగన్వాడీ స్థాయినుంచి నాణ్యమైన విద్యతోపాటు మంచి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో విజయగౌరి, సిబ్బంది పాల్గొన్నారు.
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్