తీరంలో మద్యం ఏరులు | - | Sakshi
Sakshi News home page

తీరంలో మద్యం ఏరులు

Jun 13 2025 5:13 AM | Updated on Jun 13 2025 5:13 AM

తీరంల

తీరంలో మద్యం ఏరులు

ఏయూక్యాంపస్‌: పర్యాటక ప్రాంతం సాగర తీరంలో భద్రతా లోపానికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు. చీకటి పడితే మందుబాబులకు నిలయంగా తీర ప్రాంతం మారుతోంది. దీంతో ఇక్కడ మద్యం ఏరులై పారుతోంది. నిత్యం రాత్రి వేళల్లో సాగర తీరాన మందుబాబులు చేరి విచ్చలవిడిగా పార్టీలు చేసుకుంటున్నారు. విద్యుత్‌ దీపాలు సరిగా లేకపోవడం, నిర్మానుష్యంగా పరిసరాలు మారిపోవడంతో మద్యం ప్రియులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. బీచ్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న తీర ప్రాంతం నుంచి ఆర్‌.కె.బీచ్‌ వరకు ఉన్న అనేక ప్రాంతాల్లో తాగిపడేసిన మద్యం సీసాలు నిత్యం దర్శనమిస్తున్నాయి. తగినంత పోలీసు నిఘా లేకపోవడం, పూర్తిస్థాయిలో విద్యుత్‌ లైట్లు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ నెల 21న విశాఖ సాగర తీరం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలో విద్యుత్‌ దీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం, భద్రతను పెంచడం, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడం ఎంతో అవసరం. ఈ దిశగా పోలీసులు, జీవీఎంసీ సమష్టిగా దృష్టి సారించాల్సిన అవసరముందని నగరవాసులు, సందర్శకులు సూచిస్తున్నారు.

మందుబాబులకు

అడ్డాగా తీర ప్రాంతం

ఎక్కడ చూసినా వైన్‌ బాటిళ్ల దర్శనం

తీరంలో మద్యం ఏరులు1
1/2

తీరంలో మద్యం ఏరులు

తీరంలో మద్యం ఏరులు2
2/2

తీరంలో మద్యం ఏరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement