మోదీ పాలన స్వర్ణయుగం | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలన స్వర్ణయుగం

Jun 12 2025 3:15 AM | Updated on Jun 12 2025 3:15 AM

మోదీ పాలన స్వర్ణయుగం

మోదీ పాలన స్వర్ణయుగం

● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు

సాక్షి,పాడేరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 11ఏళ్ల పాలన స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు అన్నారు.11ఏళ్ల సేవా సుపరిపాలన, వికసిత్‌ భారత్‌ 2047 కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా గిరిజన మహిళలకు స్వయం ఉపాధి పథకాలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా ఎంతో ఆర్థిక లబ్ధి చేకూరుతోందన్నారు. పీవీటీజీలకు పీఎం జన్‌మన్‌ పథకం వరమని,పెద్ద ఎత్తున పక్కాగృహాల నిర్మాణం జరుగుతుందన్నారు.జల్‌జీవన్‌మిషన్‌తో తాగునీటి పథకాలు నిర్మితమవుతున్నాయన్నారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కాఫీ బోర్డు డైరెక్టర్‌ కురుసా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు.అరకు కాఫీకి ఆర్గానిక్‌ బ్రాండ్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడా కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, జిల్లా ఇన్‌చార్జి పుట్టా గంగయ్య, ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రతినిధి పెనుమాక రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement