
ఘనంగా లక్ష్మీ హోమం
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం శ్రీచక్ర నవ వర్ణార్చన, లక్ష్మీ హోమం జరిపారు. ఈ పూజలో నలుగు రు ఉభయ దాతలు పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజలో పాల్గొనే ఆసక్తి గల భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్, అకౌంట్ నంబరు 060810011006681, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0806081లో పూజా రుసుం చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన భక్తుల వివరాలు, పూజ జరిపించాల్సిన వారి పేరు, గోత్రనామాలు, పూర్తి చిరునామా, ఫోన్ నంబరును endow& eokanaka@gov.in మెయిల్కు పంపాలి. లేదా aptemples.ap. gov.inలో నమోదు చేసుకోవచ్చు.