
వరించిన రబీ
దిగుబడి ఆశాజనకం
ఈఏడాది రబీలో వరిపంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.అర ఎకరంలో రెండవ పంటగా వరిని సాగుచేశాను.పంట కోతలు చేపట్టి నూర్పులు చేయగా 15బస్తాల ధాన్యం రావడం సంతోషంగా ఉంది.అఽధికంగా కురిసిన వర్షాలు పంట ఎదుగుదలకు మేలు చేశాయి.
– మర్రి చంద్రశేఖర్, గిరిజన రైతు, గుర్రగరువు, పాడేరు మండలం
సాక్షి,పాడేరు: రైతన్న పంట పండింది. రబీ సీజన్లో ధాన్యం దిగుబడి బాగా వచ్చింది. సమృద్ధిగా నీరు ఉండడంతో రెండో పంట రైతుల ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది దుక్కిపనులు నుంచి నారుమడుల తయారీ,వరినాట్లు పనులన్నీ జోరుగా సాగాయి. రబీ సాగుకు నీరు సమృద్ధిగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి.పంట ఎదుగుదల సమయంలో ఏప్రిల్,మే నెలల్లో విస్తారంగా కురిసిన వర్షాలు వరిపంటకు ఎంతో మేలు చేశాయి.
జిల్లా వ్యాప్తంగా 2,361 హెక్లార్లలో ఈ ఏడాది రబీలో వరిసాగు చేశారు. పాడేరు డివిజన్ పరిఽధిలో గిరిజన రైతులు తిండి గింజల అవసరాలకు రెండవ పంటగా వరి సాగుచేస్తుండగా,రంపచోడవరం,చింతూరు డివిజన్ల పరిధిలో వాణిజ్య అవసరాలకు వరి సాగుచేస్తారు. గిరిజన రైతులు రబీలో వరిని సాగు చేయడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే సాగుకు వినియోగిస్తారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి రావడంతో ఉత్సాహంగా కోతలు,వెనువెంటనే ధాన్యం నూర్పులు చేపడుతున్నారు.చింతూరు,రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎకరానికి 40 బస్తాలు,పాడేరు డివిజన్లో 30 బస్తాలు దిగుబడులు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రబీ వ్యవసాయం సిరులు కురిపిస్తోంది.
హుషారుగా పంట కోతలు, నూర్పులు
ఆశాజనకంగా దిగుబడులు
జిల్లాలో 2,361 హెక్టార్లలో సాగు

వరించిన రబీ

వరించిన రబీ

వరించిన రబీ