
కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు
సాక్షి, పాడేరు: విద్యార్థులంతా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. ఈ ఏడాది టెన్త్,ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక వి.ఆర్.పంక్షన్హాల్లో సోమవారం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన 72 మందికి, ఇంటర్లో 19 మందికి ప్రతిభా పురస్కారాలతో పాటు మెడల్స్, రూ.20వేల చెక్లను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోవాలన్నారు. టెన్త్,ఇంటర్తోనే చదువులు ఆపవద్దని తెలిపారు.ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రోత్సహించాలన్నారు.పిల్లల బలాలు,బలహీనతలపై దృష్టి పెట్టాలని చెప్పారు. విద్యార్థులకు కేరీర్ గైడెన్స్పై కూడా అవగాహన కల్పిస్తామన్నారు.91మంది టెన్త్,ఇంటర్ విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.ఈ విద్యాసంవత్సరంలోను టెన్త్,ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులంతా కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,డీఈవో బ్రహ్మాజీరావు,సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు,ఇన్చార్జి డీడీ రజనీ,ఎంపీపీ రత్నకుమారి,జీసీసీ డైరెక్టర్లు బొర్రా నాగరాజు,గంగులయ్య,ఇంటర్మీడియెట్ జిల్లా అఽధికారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్ కుమార్
91 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం

కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు