
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని పీవో ప్రారంభించారు. మెయిన్ రోడ్డు సెంటర్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో యోగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పీవో మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లో యోగాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ నెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ పి.అంబేడ్కర్, ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీఎల్డీవో కోటేశ్వరరావు, ఏవో రమణి, తహసీల్దార్ పి.రామకృష్ణ, ఏడీఏ సీహెచ్.కె.వి. చౌదరి తదితరులు పాల్గొన్నారు.
అరకులోయటౌన్: ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అరకు నియోజకవర్గం ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు తెలిపారు. యోగాంధ్రలో భాగంగా సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని లోకేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి ఆస్పత్రుల ఖర్చులు తగ్గుతాయన్నారు.ఈ ర్యాలీ పెదలబుడు గ్రామ సచివాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఇన్చార్జీ ఎంపీడీవో సత్యనారాయణ, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం