
మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి,పాడేరు: మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ హెచ్చరించారు.సోమవారం కలెక్టరేట్లో విజిలెన్స్,మానటరింగ్ సమావేశాన్ని నిర్వహించారు.మానవ అక్రమ రవాణా,వెట్టిచాకిరీ నిర్మూలన,కార్మిక చట్టాల అమలుపై అధికారులతో సమీక్షించారు. కార్మిక చట్టాల ప్రచార వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలతో పనులు చేయించకూడదన్నారు.జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లే కార్మికులను గుర్తించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్గౌడ,జిల్లా కార్మికశాఖ అధికారి సుజాత,డీఎస్పీ సహబాజ్ అహమ్మద్,డీఆర్డీఏ పీడీ మురళీ,ఎల్డీఎం మాతునాయుడు,జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జనార్ధనరావు,జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి సాధు తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలంలో ఇసుక సేకరణ నిషేధం
గోదావరి ఇసుక రీచ్ల నుంచి వర్షాకాలంలో ఇసుక సేకరణ నిషేధిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. సోమవారం నిర్వహించిన జిల్లా
స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 15వరకు గోదావరి రీచ్ల నుంచి ఇసుక సేకరణ నిలిపివేస్తున్నట్టు చెప్పారు.స్థానిక అవసరాలకు స్థానికంగా ఉన్న జలపాతాలు,గెడ్డల వద్ద ఇసుకను సేకరించవచ్చని తెలిపారు.ఎటపాక మండలం గుండాల ఇసుక రీచ్ వద్ద 1.19లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని చెప్పారు. వి.మాడుగుల,కొత్తవలస,బొబ్బిలి,నర్సీపట్నం వద్ద ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని,వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో జేసీ అభిషేక్గౌడ, మైన్స్ ఏడీ ఎం.ఆనంద్,భూగర్భ జలాలశాఖ డీడీఎం మురళీధర్,ఎస్ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు,ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నీలిమా తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్