
సత్యదేవుని ఆలయంలోప్రత్యేక పూజలు
డాబాగార్డెన్స్: నగరంలోని ఇసుకకొండపై వెలసిన శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నిత్యపూజలు, సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం వైదిక సదస్యం, మహదాశీర్వచనం(పండిత సత్కారం) నిర్వహించారు. 9న ఉదయం నిత్యపూజలు, సాయంత్రం 6 గంటలకు స్వామి తిరువీధి(రథోత్సవం), విశేష హోమాలు నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి టి.రాజగోపాల్రెడ్డి తెలిపారు. 10న దోపోత్సవం (తిరుమంగైయాళ్వారు కై ంకర్యం), 11న జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు వేకువ జాము 2 నుంచి 4 గంటల వరకు విశేష పూజలు, 7 గంటల నుంచి స్వామి వారి సామూహిక విశేష వ్రతాలు జరపనున్నట్లు తెలియజేశారు.