
నేటి నుంచి మోదమ్మ జాతర
● నక్కలపుట్టు, తుంపాడ,
గుత్తులపుట్టులో ఘనంగా ఏర్పాట్లు
సాక్షి,పాడేరు: మండలంలోని నక్కలపుట్టు, తుంపాడ, గుత్తులపుట్టు గ్రా మాల్లో ఆదివారం నుంచి మూడు రోజులపాటు మో దకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిలో భాగంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ వెలుగులు ఏర్పాటుచేశారు. ఉదయం 7గంటల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను ఊరేగించి కొలువుదీర్చేందుకు సతకంపట్టు వద్ద మండపాలు ఏర్పాటచేశారు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. చివరిరోజు మంగళవారం ఉత్సవాల అనుపు ఉత్సవం జరుగుతుందని కమిటీలు తెలిపాయి.