
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
చింతూరు: ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా తెలిపారు. మోతుగూడెం పోలీసుస్టేషన్ ఎదుట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తారసపడిన కారును ఆపి తనిఖీచేయగా రూ.ఐదు లక్షల విలువైన వంద కిలోల గంజాయి లభ్యమైనట్లు ఆయన తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న చింతూరు మండలం తూలుగొండకు చెందిన కరణం రామాంజనేయులు, ఆరెళ్ల బొజ్జిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఒడిశాలోని మల్కనగిరికి చెందిన కొవ్వాసి తాతారావు వద్ద కొనుగోలు చేసిన గంజాయిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సుభానీ అనే వ్యక్తికి అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పట్టుబడినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులు ఓ గ్యాంగ్గా ఏర్పడి గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని, వీరిపై గతంలో కూడా చింతూరు పోలీసుస్టేషన్ పరిధిలో కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులు కూడా జప్తుచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐలు సాధిక్, రమేష్ పాల్గొన్నారు.
ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగాపట్టుకున్న పోలీసులు