ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

Jun 8 2025 12:50 AM | Updated on Jun 8 2025 12:50 AM

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో స్థానిక సీహెచ్‌సీతోపాటు కిలగాడ పీహెచ్‌సీలో శనివారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విజయనగరం శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది. 187 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మండల ఆప్తమాలిక్‌ అసిస్టెంట్‌ కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న 67మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించామని, వీరిని బస్సులలో విజయనగరం తరలించామని చెప్పారు. శస్త్రచికిత్సల సమయంలో మూడు రోజులపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రమేష్‌, శిరీష, గీతాంజలి, ధరణి, నాయక్‌, ఆరోగ్య విస్తరణ అధికారి సుబ్రహ్మణ్యం, పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

187 మందికి నేత్ర వైద్య పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement