
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో స్థానిక సీహెచ్సీతోపాటు కిలగాడ పీహెచ్సీలో శనివారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విజయనగరం శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది. 187 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మండల ఆప్తమాలిక్ అసిస్టెంట్ కిషోర్కుమార్ మాట్లాడుతూ తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న 67మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించామని, వీరిని బస్సులలో విజయనగరం తరలించామని చెప్పారు. శస్త్రచికిత్సల సమయంలో మూడు రోజులపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రమేష్, శిరీష, గీతాంజలి, ధరణి, నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి సుబ్రహ్మణ్యం, పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
187 మందికి నేత్ర వైద్య పరీక్షలు