
ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత
పెదబయలు: మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం తహసీల్దార్ రంగారావు, ఎంపీడీవో ఆధ్వర్యంలో స్థానిక జీసీసీ పెట్రోల్ బంక్ నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపును జేసీబీతో చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గిరిజన, గిరిజనేతర వర్తకులు అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా తొలగిస్తే ఒక్క దుకాణం కూడా మిగిలే పరిస్థితి లేదని, జీవనోపాధి కోల్పోతామని వాపోయారు. ఈ పరిస్థితుల్లో రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల మేర ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగిస్తామని వారు తహసీల్దార్కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ మిగిలిన ఆక్రమణలను రెండు వారాల తరువాత తొలగిస్తామని స్పష్టం చేశారు. దీంతో వ్యాపారులు స్వచ్ఛదంగా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పెద్దఎత్తున రెవెన్యూ, ఆర్అండ్బీ, మండల పరిషత్, విద్యుత్, అటవీశాఖ అధికారులు, పోలీసులు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ పలాసి మాధవరావు, ఎంపీటీసీ బొంజుబాబు, ఆర్ఐ పూర్ణయ్య, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
దుకాణాలు తొలగిస్తే ఉపాధి
కోల్పోతామని వ్యాపారుల ఆవేదన
50 అడుగుల మేర స్వచ్ఛందంగా తొలగిస్తామన్న పెదబయలు వ్యాపారులు
అంగీకరించిన అధికారులు