
షైనింగ్ స్టార్స్–2025 అవార్డులకు ముగ్గురు ఎంపిక
రంపచోడవరం: పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జెడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్–2025 అవార్డులకు ఎంపికయ్యారు. విద్యార్థులు గొర్రిల మంజుల, మట్టా సాయి ప్రదీప్, బొమ్మిన విజయేంద్రవర్మ ఎంపికై నట్లు హెచ్ఎం వీరవిల్లి ముత్యాలరావు తెలిపారు. అవార్డు కింద రూ. 20 వేల నగదు, షీల్డు, ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరిస్తారని ఆయన తెలిపారు. ఈ నెల 9న పాడేరులోని వీఆర్ పంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారని ఆయన వివరించారు. అవార్డుకు ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు దేవుడు తదితరులు అభినందించారు.

షైనింగ్ స్టార్స్–2025 అవార్డులకు ముగ్గురు ఎంపిక