
కుటుంబం చెంతకు బీహార్ వ్యక్తి
అల్లిపురం: నల్లమందుకు అలవాటు పడి మతిస్థిమితం కోల్పోయి రోడ్డున పడ్డ బీహార్ వ్యక్తిని ఏయూటీడీ సభ్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. జీవీఎంసీ ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం, దర్భంగ జిల్లా సిసపునా గ్రామానికి చెందిన రాంబిహారి ఇల్లు వదిలిపెట్టి లూథియానా వెళ్లిపోయాడు. అక్కడ బిచ్చగాళ్లతో స్నేహం చేసి నల్లమందుకు అలవాటుపడ్డాడు. దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో మత్తులో ఎక్కడెక్కడో తిరిగి విశాఖ చేరుకున్నాడు. గత ఏడాది నవంబర్లో రైల్వే స్టేషన్లో ఏయూటీడీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో అతను పట్టుబడ్డాడు. అతన్ని షెల్డర్కు తరలించి పూణేకి చెందిన శ్రద్ధ ఫౌండేషన్ సహకారంతో చికిత్స అందించడంతో అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో అతన్ని నేరుగా బీహార్లోని అతని స్వగ్రామానికి తీసుకెళ్లి అతని తల్లి కౌశల్య ముఖియా, సోదరుడు రాజ్కుమార్ ముఖియాకు అప్పగించారు. దీంతో వారు ఏయూటీడీ, శ్రద్ధా ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.