
నేత్రపర్వంగా కల్యాణోత్సవాలు
అల్లిపురం: జగదాంబ జంక్షన్ సమీపంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారితో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణం చూడ ముచ్చటగా జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అడపా దేముళ్లు పర్యవేక్షణలో ఈ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు.
అంబికాబాగ్ రామాలయంలో ధ్వజారోహణం..
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దత్తత దేవాలయం అంబికాబాగ్ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం, అంకురార్పణ నిర్వహించారు. శనివారం ఉదయం విశేష హోమాల అనంతరం, 10.30 గంటలకు స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరపనున్నారు. సాయంత్రం విశేష హోమాలు నిర్వహించనున్నారు.

నేత్రపర్వంగా కల్యాణోత్సవాలు