
పేద విద్యార్థికి డాక్టరేట్
ఎటపాక: అక్షరాలే ఆస్తిగా ...చదువే సంపదగా భావించి రిజర్వేషన్ల సహకారంతో చదువుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ సాధించాడు. ఎటపాక మండలం నందిగామ గ్రామానికి చెందిన ఇసంపల్లి రాములు, బంగారమ్మ దంపతుల రెండవ కుమారుడు ఇసంపల్లి వెంకన్న కుటుంబం కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. వెంకన్న ప్రభుత్వ బడులు, వసతి గృహాల్లో ఉంటూ పట్టుదలతో చదువు కొనసాగించాడు. బిగ్ డేటా, టాపిక్ మోడలింగ్ టెక్నిక్ తదితర అంశాలపై పరిశోధనలను జేఎన్టీయూహెచ్లో వెంకన్న పూర్తి చేశాడు. ఇందుకుగాను ఈనెల 3న హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నాడు. గ్రామస్తులు, స్నేహితులు పలువురు ఆయనను అభినందించారు.