
నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించడంతో ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. శనివారం రాత్రి కొంతమంది భక్తులు వారి స్వగృహాలు వద్ద అమ్మవారి పాట నిర్వహించి, ఆదివారం ఉదయం 8 గంటలకు కుటుంబ సమేతంగా ఇక్కడ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరి కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయ సమీపంలో చలువ పందిళ్లు వద్ద కుటుంబ సమేతంగా వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ వెంపలి రాంబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తాగునీరు, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్లబాబు), ఆలయ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు