
ఐదేళ్లు సుపరిపాలన అందించిన ఘనత జగన్దే
సాక్షి,పాడేరు: ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్కు తమ అఽధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఆమర్యాదగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. చదువుకున్న వ్యక్తిగా నీకున్న సంస్కారం ఇదేనా శ్రావణ్ అంటూ ఆమె ప్రశ్నించారు. 2019నుంచి 2024 వరకు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందినా నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నావని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలుజేసిందన్నారు. గిరిజనుల పక్షపాతిగా తమ అధినేత జగన్మోహన్రెడ్డి పేరొందారన్నారు. గిరిజనులకు శాశ్వత ఆరోగ్యసేవలు లక్ష్యంగా రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల, అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు చేపట్టడం అభివృద్ధి కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను గిరిజనుల ముంగిట ఉంచే లక్ష్యంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. ఒక్క పాడేరు నియోజకవర్గంలోనే రూ.175 కోట్లతో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తాగునీటి పథకాలు నిర్మించడం జరిగిందని, మారుమూల ప్రాంతాలకు రోడ్లు, ప్రమాదకర గెడ్డలపై వంతెనల నిర్మాణాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.అభివృద్ధి అంతా కళ్లముందే ఉన్నా జీసీసీ చైర్మన్ శ్రావణ్కు కనబడడక పోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమలుకాని హమీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలనపై ఏడాదిలోనే ప్రజలకు విసుగు చెందారని, వారంతా తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలంతా మళ్లీ వైఎస్సార్సీపీకే పట్టం కడతారని, సీఎంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి మళ్లీ బాధ్యతలు స్వీకరించడం ఖాయమని ఆమె పేర్కొన్నారు.
ఆయనను విమర్శించే స్థాయి
కిడారి శ్రావణ్కు లేదు
ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు
కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ధ్వజం