
4న ‘వెన్నుపోటు దినం’ జయప్రదం చేయండి
అనంతగిరి(అరకులోయ టౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో వచ్చే నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. మండలంలోని బొర్రా గేటువలస బ్రో కార్యాలయంలో పార్టీ మండల నాయకులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న వెన్ను పోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మరోసారి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. అనంతగిరి మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్న దొర, ఎంపీటీసీ కురిసెల అరుణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాంగి అప్పారావు, సర్పంచ్లు సెంబి సన్యాసిరావు, జన్ని సన్యాసిరావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాడి కృష్ణమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి దోనేటి డానియల్, మాజీ సర్పంచ్లు శిరగాం దేవకుమార్, సుబ్బారావు, పార్టీ నాయకులు సమరెడ్డి రఘునాథ్, నవీన్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మత్స్యలింగం పిలుపు