జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి

May 28 2025 11:40 AM | Updated on May 28 2025 11:40 AM

జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి

జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి

డివిజన్‌ మేనేజర్‌ వెంకటేష్‌

చింతపల్లి: గిరిజన సహకార సంస్థ పురోభివృద్ధికి సంస్థ ఉద్యోగులు కృషి చేయాలని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ బుక్కా వెంకటేష్‌ అన్నారు.ఆయన మంగళవారం కార్యాలయంలో సూపరింటెండెంట్లు, సేల్స్‌మెన్‌లు,సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసీసీపై ప్రజల్లో మంచి నమ్మకం ఉందన్నారు. కేవలం బియ్యం విక్రయానికే పరిమితం కాకుండా గిరిజనులు పండించి,సేకరించే వ్యవసాయ,అటవీ ఉత్పత్తుల కొనుగోలు పైనా దృష్టి సారించాలన్నారు. ఇకపై ప్రతి రేషన్‌ డిపో పరిధిలో గల వారపు సంతల్లో గిరిజన ఉత్పత్తుల సేకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సంస్థ సేవలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్‌ సుగునాథం,ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ సూపరింటెండెంట్‌ రమణమూర్తి,గ్యాస్‌ గోడౌన్‌ సూపరింటెండెంట్‌ రమణమూర్తి సీనియర్‌ సేల్ప్‌మేన్‌ శెట్టి చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement