
శ్వాస అందక మూడు నెలల పసికందు మృతి
చింతపల్లి;మూడు నెలల చిన్నారి శ్వాస అందక మృతి చెందిన సంఘటన బుధవారం అర్థరాత్రి చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కుటుంబీకులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన వంజరి ఈశ్వరి, గణపతి దంపతుల మూడు నెలల పాపకు గతంలో రెండుసార్లు వ్యాక్సిన్ వేశారు.బుధవారం మరోమారు అంగన్వాడీ కేంద్రంలో వ్యాక్సిన్ వేశారు. దీంతో చిన్నారికి జ్వరం సోకింది. వెంటనే చిన్నారి తండ్రి ఏఎన్ఎంకి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయగా వాక్సిన్ తరువాత జ్వరం రావడం సహజమని ఆమె చెప్పారు.అయితే సాయంత్రానికి జ్వరం తీవ్రత అఽధికమై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో గాలి సోకిందని భావించి సంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి వైద్య సేవలు చేశారన్నారు.శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాత్రి 8 గంటలు దాటిన తరువాత చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.అప్పటికే ఆ శిశువు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది.ఆ సుపత్రి వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంచడంతో మెరుగైన వైద్య సేవలకు విశాఖ కేజిహెచ్కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు.అప్పటికే ఆ పసికందు మృతి చెందింది.దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.