
నకిలీ ధ్రువపత్రాల కేసులో ముగ్గురు అరెస్ట్
ఇచ్చోడ: మండలంలోని ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ నివాస ధ్రువపత్రాలు సృష్టించిన కేసులో కేశవపట్నానికి చెందిన షేక్ కలీం, ఇస్లాంనగర్కు చెందిన షేక్ ఫరీద్, జాదవ్ గజానంద్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కా ర్యాలయంలో ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. గత రెండునెలల క్రితం ఇస్లాంనగర్లో నివాసముంటున్నట్లు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు నకిలీ ధ్రువపత్రాలు పొంది ఆర్మీ, బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందారు. నిందితులు ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన యువత నివాస ధ్రువపత్రాలు పొందే విషయంలో ఫేక్ ఇంటి నంబర్, ఆధార్కార్డులు ఇచ్చి సహకరించారు. ఇందుకు గాను వారి వద్ద నుంచి రూ.9 లక్షలు తీసుకున్నారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలు పొంది ఉద్యోగాలు చేస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ విషయమై ఆర్మీ, బీఎస్ఎప్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. మండల కేంద్రంలో కొందరు మీ సేవ కేంద్రాల పేరుతో బోర్డులు పెట్టి ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు.