
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రాటవెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 28 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలి పిన వివరాలు.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 32 మంది ఉన్నారు. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో మండల కేంద్రానికి చేరుకుంది. కాగా, మండల కేంద్రంలో సర్వీసు రోడ్డు పనులు నేపథ్యంలో నిర్మాణ సంస్థ ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుకాల మరో బస్సు వేగంగా వస్తోంది. ట్రావెల్స్ డ్రైవ ర్ ఆ బస్సు వెళ్లడానికి దారి ఇచ్చేక్రమంలో హెచ్చరిక బోర్డు దాటగా సర్వీసు రోడ్డుపై మెల్లగా బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగా యాలు కాగా, అందులో జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన గాడిగు నరేంద్ర, అమరావతికి చెందిన ఇర్ఫాన్ మన్స్రీ, యవత్మాల్ జిల్లా ఘటానాకు చెందిన ఎండీ హర్భాజ్, అమరావతి పరత్వాడకు చెందిన ఆనంద్ అగ్రవాల్ ఉన్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను రిమ్స్కు తరలించి చికిత్స అందజేశారు. రిమ్స్లో క్షతగాత్రులను డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పరామర్శించారు. అయితే బస్సు వేగం తగ్గించడంతో మెల్లగా మట్టి రోడ్డుపై పడడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.మధుకృష్ణ తెలిపారు.
జాతీయ రహదారి 44పై
గుడిహత్నూర్ వద్ద ఘటన
నలుగురికి తీవ్ర, 28 మందికి స్వల్ప గాయాలు
క్షతగాత్రుల రిమ్స్కు తరలింపు
తప్పిన పెను ప్రమాదం

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా