
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ద ర్శించుకునేందుకు సోమవారం తెలంగాణ, ఆ ంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆల య అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. 1000 రూపాయల అభ్యాసం టికెట్లు 280, 150 అక్షరాభ్యాసం టికెట్లు 425, వివిధ ఆర్జిత సేవల టికెట్ల ద్వారా ఆలయానికి రూ.8.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న క్రికెట్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అ సోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడిపే ట్ బెటాలియన్లో గ్రీన్, యెల్లో జట్లకు పోటీలు నిర్వహించగా మొదటి ఇన్నింగ్స్లో గ్రీన్ జ ట్టు 328 పరుగులు, యెల్లో జట్టు 274 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్లో యెల్లో జ ట్టు 158 పరుగులు, గ్రీన్ జట్టు 274 పరుగులు సాధించగా, గ్రీన్ జట్టు విజయం సాధించినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా జి.చరణ్, బెస్ట్ బ్యాట్స్మెన్గా అవినాశ్ జాదవ్, బెస్ట్ బౌలర్గా అనిరుధ్ నిలిచారు.
ఒకరిపై కేసు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన మహ్మద్ అలీమొద్దీన్ సోమవారం మహారాష్ట్ర నుంచి పశువులను తీసుకువచ్చి వధించేందుకు సిద్ధంగా ఉంచాడు. తన ఇంటి ముందు కట్టి ఉంచిన ఎనిమిది ఎద్దులను వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
చెక్పోస్టును తనిఖీ చేసిన సీఐ
జన్నారం: మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి తని ఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశం ఉన్నందువల్ల ముందస్తుగా ప్ర తీ వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు.