
ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలి
ఉట్నూర్రూరల్: ఏజెన్సీ ప్రాంతంలో డీఎస్సీ నిర్వహించి ట్రైబల్ నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఏజెన్సీ సాదన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ సోమేశ్ సోమవారం ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2,345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందని, ఇప్పటి వరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో జూలైలో ఐటీడీఏ ఎదుట నిరాహారదీక్ష చేపడుతామన్నారు. కార్యక్రమంలోనాయకులు కొచ్చెర కిషోర్, ఆత్రం జాలింషావ్, మడావి మనోహర్, మెస్రం ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.