
అవతరణ అతిథులు వీరే..
కై లాస్నగర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జూన్ 2న అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనే ముఖ్య అతిథుల పేర్లు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చే శారు. ఆదిలాబాద్లో నిర్వహించనున్న వేడుకలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీ, మైనార్టీ సంక్షేమఽశాఖల ప్రభు త్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, కుమురంభీం ఆసిఫాబాద్లో రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంచిర్యాలలో ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, నిర్మల్లో వేడుకలకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే వేడుకల్లో ఉదయం 10గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
జిల్లాకు 7,010 ఇందిరమ్మ ఇళ్లు
ఇంద్రవెల్లి: జిల్లాకు రెండు విడతల్లో 7,010 ఇందిర మ్మ ఇళ్లు మంజూరైనట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపా రు. శుక్రవారం మండలంలోని గిన్నెర గ్రామంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. క లెక్టర్ మాట్లాడుతూ.. కొందరు లబ్ధిదారులు బేస్మెంట్ దశలో పనులు నిలిపివేయగా వారికి మహిళా సంఘాల ద్వారా రుణ సౌకర్యం కల్పించి పనులు కొనసాగేలా చూస్తున్నట్లు చెప్పారు. ఖానాపూర్ ఎ మ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. గిరిజను ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలి పారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం తదితరులు పాల్గొన్నారు.