వన మహోత్సవం విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవం విజయవంతం చేయాలి

May 29 2025 7:10 AM | Updated on May 29 2025 7:19 AM

వన మహోత్సవం విజయవంతం చేయాలి

వన మహోత్సవం విజయవంతం చేయాలి

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: జిల్లాకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వన మహోత్సవం, ఇందిర సౌర గిరి జల వికాసం, పీఎం జన్‌ మన్‌ కా ర్యక్రమాల అమలుపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యక్రమంపై విస్తృత ప్రచా రం కల్పించి, సామూహిక మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ శ్యామలా దేవి, డీఎఫ్‌వో ప్రఽశాంత్‌ బాజీరావు, ఆర్డీవో వినోద్‌ కుమార్‌, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, డీపీవో రమేశ్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జేఆర్‌ చౌహాన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం..

సాత్నాల: జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన భోరజ్‌ మండలంలో రైతుల భూ సమస్యలపై అందిన ప్రతీదరఖాస్తును పరిష్కరిస్తామని కలెక్టర్‌ రాజ ర్షిషా అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. భూ భారతి దరఖాస్తుల ప్ర గతిపై ఆరా తీశారు. ఆయనవెంట తహసీల్దార్లు రాజే శ్వరి, నలంద ప్రియ, రఘునాథ్‌రావు, ఽశ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement