ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంకు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంకు పురస్కారం

May 1 2025 2:11 AM | Updated on May 1 2025 2:11 AM

ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌   టీంకు పురస్కారం

ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంకు పురస్కారం

ఆదిలాబాద్‌టౌన్‌: ఉత్తమ సేవలందించిన జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని అబ్కారీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమలాసన్‌రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతి అందజేశారు. బహుమతి అందుకున్న వారిలో సీఐలు గంగారెడ్డి, అక్బర్‌ హుస్సేన్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు ఇంతియాజ్‌, రవికుమార్‌, అశ్వక్‌, సాయిప్రసాద్‌, కానిస్టేబుళ్లు సిద్ధేశ్వర్‌, అరవింద్‌, సందీప్‌ జమీర్‌, ఈశ్వర్‌, సతీష్‌, మేరి, విజయశ్రీ ఉన్నారు. బృందాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ హిమశ్రీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement