
దేశవ్యాప్త బంద్ జయప్రదం చేయండి
ఆదిలాబాద్టౌన్: మే 20న తలపెట్టిన దేశ వ్యాప్త బంద్ జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మూ డో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే 44 కార్మి క చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మి కులను బానిసలుగా మార్చే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. వీటిని నిరసిస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త గ్రామీణ హడ్తాల్, బంద్ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్నాయక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఆయా సంఘాల నాయకులు స్వామి, చిన్నన్న, విష్ణు, నగేశ్, నవీన్, ఆశన్న, గంగారాం, నాగారావు తదితరులు పాల్గొన్నారు.