
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
● బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్
కై లాస్నగర్: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని, బాధిత కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపన కోసం చేపట్టిన లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా శుక్రవారం సాత్నాల మండలంలోని పార్డి–బి గ్రామంలో పర్యటించారు. విద్యుత్ షాక్తో మరణించిన రైతులు ఉగ్గే హనుమంతు, బొనిగల రాజు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రూ.15లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఉపాధ్యక్షురాలు సుష్మ, కార్యదర్శి గంగన్న, నాయకులు నవీన్, సాయి, రాంచందర్, శ్రీవాణి, దివ్యవాణి, సంతోష్ తదితరులున్నారు.