-
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదొక నిదర్శనం
సాక్షి, పల్నాడు: దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్కి ఏపీ నెలవు కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని యడ్లపాడు మండలం వంకాయల పాడు గ్రామంలో శుక్రవారం గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ స్పైసెస్ ఫెసిలిటీ.. పద్నాలుగు వేల మంది రైతులకు గొప్ప వరంగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు. సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. దాదాపు 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. ఇది మొదటి దశ మాత్రమే. రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఘనత మనకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 2020లో మొదలుపెట్టి.. ఇప్పుడు కమిషన్ చేయడం దాకా కేవలం 24 నెలల్లోనే అడుగులు పడడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని సీఎం జగన్ ప్రస్తావించారు. రెండో దశ పనుల కోసం ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు సీఎం జగన్. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్కు ఇదొక నిదర్శనం. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలను అడిగి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం తీసుకోవడం గొప్ప మార్పుగా సీఎం జగన్ అభివర్ణించారు. రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 3,450 కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ప్లాన్ చేసిందని, దీనివల్ల ప్రతీ జిల్లాలో ఉన్న రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని తెలిపారు. ఇవి రైతుల పాలిట వరంగా మారనున్నాయన్నారు. ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని తెలిపారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్
Updates 12:35PM మైనార్టీ దినోత్సవంలో సీఎం జగన్ స్పీచ్ ►నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి ►మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు మరువలేనివి ►ముస్లింల్లో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్ ►పదవుల నుంచి సంక్షేమం వరకూ అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం ►ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాం ►నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చాం ►శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించాం ►మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ. 10,309 కోట్లు అందించాం ►నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 10 వేల కోట్లు అందించాం ►చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు రూ. 2,665 కోట్లు ఇస్తే..మూడేళ్లలోనే మేము రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చాం ►వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం ►ఇప్పటికే అన్యాక్రంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాం ►ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దు 12:17PM గుంటూరు: మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ 11:06AM గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ ►ఐటీసీ సంస్థకు అభినందనలు ►ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ వల్ల వేలాది మంది రైతులకు మేలు కలుగుతుంది ►ఇదొక వండర్ ఫుల్ మూమెంట్ ►సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు ►15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు ►రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గరే ఉంటుంది ►ఈ యూనిట్ 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నా ►24 నెలల్లోనే యూనిట్ ను పూర్తి చేశారు ►ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదొక నిదర్శనం ►మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది ►3450 కోట్లతో ప్రతీ జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాం ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ►మొదటి దశ కింద 1250 కోట్లతో 10 యూనిట్లకు డిసెంబర్ , జనవరి నెలల్లో శంకుస్థాపన ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయి ►రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ప్రాసెసింగ్ చేసే విధానం చాలా బాగుంది ►ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుంది ►ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుంది ►ఏ చిన్న సమస్య ఉన్నా... ఒక్క ఫోన్ చేసినా చాలు వెంటనే స్పందిస్తాం 10:37AM ►వంకాయలపాడు సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ►గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్కు ప్రారంభోత్సవం 10:01AM ►వంకాయలపాడు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ►పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను ఆయన ప్రారంభించనున్నారు. ► ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ.. రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్ స్పైసెస్ పార్క్ను అందుబాటులోకి తేనుంది. ► సుమారు 6.2 ఎకరాల్లో ఈ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్ స్పైసెస్ పార్క్ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయనుంది. ► సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఈ గ్లోబల్ స్పైసెస్ పార్క్కు. పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ► గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది. ► సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభ కార్యక్రమ అనంతరం.. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. ఆపై గుంటూరు మెడికల్ కళాశాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్ను ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు. ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') ఆ తండ్రి బాధ తీర్చలేనిది.. మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు. -
జామరైతు ఆలోచన అదుర్స్
సాక్షి, యడ్లపాడు: జామతోట సాగు చేసే రైతులకు పండుఈగతో బాధలెన్నో.. అందులోనూ థైవాన్రకం జామతోటలకు ఈ పండుఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. మొక్కకు ఉన్న కాయలు బాగా సైజు పెరిగి పండుదశకు చేరుకునే సమయంలో ఈగలు కాయ ల్లోకి జొరబడి పూర్తిగా పాడు చేస్తాయి. దీంతో థైవాన్ రకాన్ని సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. మూడేళ్లగా పండుఈగతో ఇబ్బందులు.. మండలంలోని చెంఘీజ్ఖాన్పేటకు చెందిన కౌలు రైతు గడ్డం రామసుబ్బారావు 8 ఎకరాల్లో మూడేళ్ల నుంచి థైవాన్లోని రెడ్, వైట్ జామ రకాలను సాగు చేస్తున్నాడు. అయితే కాయ పక్వానికి వచ్చే సమయంలో ఆశిస్తున్న పండుఈగ నివారణకు తొలుత మలాథిన్ ద్రావణాన్ని వినియోగించాడు. అది కేవలం 24 గంటలు మాత్రమే పనిచేయడంతో రోజు మార్చి రోజు వీటిని చల్లడం పెట్టుబడి పెరిగిపోతుందని గ్రహించాడు. లింగాకర్షణ బుట్టల్ని తెచ్చి ఏర్పాటు చేశాడు. వీటి వల్ల 75శాతం పంటను కాపాడు కోగలిగానని తెలిపాడు. ఇవి 40 రోజులు మాత్రమే పని చేయడం, వర్షం కురిస్తే పనిచేయక ఒక్కసారిగా ఈగ ధాటి అధికమవ్వడంతో విసుగెత్తిపోయింది. ఆలోచన బాగుంది ఖర్చు తగ్గింది! ఆ అనుభవంలోంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్లాస్టిక్ పాలిథిన్ పలుచటి కవర్లను తీసుకువచ్చి పిందెలను అందులో ఉంచి పిన్నులు కొట్టాడు. అంతే ఇప్పుడు జామకాయలకు పండుఈగ నుంచి పూర్తిగా రక్షణ కల్పించగలిగినట్లు వెల్లడించాడు. ఇలా కవర్లు తొడిగినపుడు కాయపై అధికంగా అంటుకున్న కవర్లలోని కొన్ని కాయలు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా పెద్దగా పెట్టుబడి లేని ఈ నివారణ వల్ల మనశ్శాంతిగా ఉంటున్నట్టు చెబుతున్నారు. -
భార్యను కడతేర్చిన భర్త
సాక్షి, గుంటూరు : ప్రమాదవశాత్తు కాళ్లూ చేతులు విరిగి మంచానపడ్డ భర్తకు ఎన్నో సపర్యలు చేసి తిరిగి మామూలు మనిషిగా మార్చిన భార్యను భర్తే హతమార్చిన ఘటన కలకలం రేపింది. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీలో గురువారం సాయంత్ర ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నవ ఎస్సీ కాలనీకు చెందిన కాకర్లమూడి నాగేశ్వరరావుకు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన అనురాధ (23)తో 9 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. రాడ్బెండింగ్ పనులు నిర్వహించుకుని కుటుంబాన్ని పోషించుకునే నాగేశ్వరరావుకు కొంతకాలంగా మతిస్థిమితం ఉండటం లేదు. మొదట రాడ్బెండింగ్ పనుల్లో సంపాదించిన డబ్బులతో ఆటోను కొనుగోలు చేసి డ్రైవర్గా తిరిగాడు. ఫైనాన్స్లో తెచ్చిన ఆటోకు వాయిదాలు సక్రమంగా చెల్లించనందున ఫైనాన్స్ వారు దాన్ని తీసుకెళ్లారు. మళ్లీ ఫైనాన్స్తో మరోఆటోను తీసుకున్నాడు. అయితే దాని పరిస్థితి కూడా అదేవిధంగా మారడంతో తిరిగి రాడ్బెండింగ్ పనుల్లోకి వెళ్లడం మొదలెట్టాడు. పనులకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండటంతో ఫైనాన్స్లోనే బైక్ను కొనుగోలు చేశాడు. ఆదాయం అంతమాత్రంగానే ఉండటంతో కిస్తీలు చెల్లించక బైక్ ఫైనాన్స్ ఆఫీసుకే చేరింది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చి 2018లో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తిసాగు చేపట్టాడు. అందులోనూ నష్టాన్నే చవిచూశాడు. ఇలా జీవితంలో అప్పులు, నష్టాలనే కూడగట్టుకున్న నాగేశ్వరరావు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఆలోచనలు ఎక్కువై మతిస్థిమితం లేకుండా పోయింది. వింతగా ప్రవర్తించడంతో బంధువులు చేతబడి చేశారని భావించి భూతవైద్యుడిని పిలిపించి రూ.25వేల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. డాబాపై నుంచి ఒక్కసారిగా దూకేశాడు. కాళ్లు చేతులు తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. భార్య అనురాధ భర్త మామూలు మనిషి అయ్యేంత వరకు సేవలు చేసింది. హత్య జరిగిందిలా... గత 3, 4 రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పిల్లల్ని సైతం చంపేస్తానంటూ బెదిరించడంతో అనురాధ ఇద్దరు పిల్లల్ని బుధవారం తన పుట్టింటికి పంపించింది. గురువారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ కలిసి భోజనం చేసి మామూలుగానే ఉన్నారు. అయితే సాయంత్రం 3.30 గంటల మధ్యలో ఇంట్లో ఉన్న భార్యను మంచంపై పడేసి గుండెలపై కూర్చొని నోట్లో గుడ్డల్ని కుక్కి గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఇంటి బయటకు వచ్చి నా భార్యను చంపేశానంటూ చెప్పడంతో అవాక్కైన స్థానికులు పరుగున వెళ్లి ఇంట్లో చూడగా అప్పటికే అనురాధ విగత జీవిగా పడిఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై జె.శ్రీనివాస్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement