breaking news
wash out
-
మూడో వన్డే కూడా రద్దు.. వన్డే సిరీస్ న్యూజిలాండ్దే
క్రైస్ట్చర్చ్ వేదికగా జరగుతున్న భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. కాగా 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్లు రద్దు చేశారు. కాగా వరుసగా రెండు వన్డేలు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి. అంతకుముందు టీ20 సిరీస్లో కూడా ఆఖరి టీ20 వర్షం కారణంగానే ఎటువంటి ఫలితం తేలలేదు. ఇక తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టామ్ లాథమ్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. రాణించిన వాషింగ్టన్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(49) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, మిచెల్ తలా మూడు వికెట్లు సాధించగా.. సౌథీ రెండు, శాంట్నర్ ఒక్క వికెట్ సాధించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Ind Vs NZ: అతడు వెలకట్టలేని ఆస్తి! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! -
మరోసారి విలన్గా మారిన వర్షం.. న్యూజిలాండ్- భారత్ రెండో వన్డే రద్దు
భారత్-న్యూజిలాండ్ సిరీస్లో వరుణుడు మరోసారి విలన్గా మారాడు. హామిల్టన్ వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్కు తొలుత వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు మూడు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు. అయితే మళ్లీ భారత ఇన్నింగ్స్ 12.5 (89-1) వద్ద వర్షం తిరుగుముఖం పట్టింది. దీంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఇక వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. భారత ఇన్నింగ్స్లో శుబ్మాన్ గిల్(45), సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో క్రీజులో ఉండగా మ్యాచ్ రద్దైంది. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం(నవంబర్ 30)న క్రైస్ట్ చర్చ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలుపొందితే 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. చదవండి: IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
ఇక కాంగ్రెస్ వంతు
♦ పూర్తి స్థాయిలో బలోపేతమే లక్ష్యంగా టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ ♦ జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై అంచనా ♦ 2019 ఎన్నికల్లో ఏకఛత్రాధిపత్యం సాధించే వ్యూహం సాక్షి, హైదరాబాద్: పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా అధికార టీఆర్ఎస్ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకుందా.., పార్టీ భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకునే ఆయా పార్టీల్లో సీనియారిటీ ఉన్న, తమ తమ నియోజకవర్గాల్లో జనామోదం ఉన్న నేతలకు గురిపెట్టిందా.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నారు. టీఆర్ఎస్లో చేరికలను ఆ పార్టీ ‘రాజకీయ పునరేకీకరణ’ అని ముద్దుగా పిలుస్తున్నా... ఇదంతా 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావడమేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉంటే ఒకటే ఉండాలని, రెండు ప్రాంతీయ పార్టీల అవసరమే లేదన్న ఉద్దేశంతో టీడీపీ ఉనికే లేకుండా చేసిన గులాబీ నాయకత్వం... మరికొందరు కాంగ్రెస్ సీనియర్లపైనా వల విసిరే పనిలో ఉందని సమాచారం. పధ్నాలుగేళ్లపాటు సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్... రాజకీయ వ్యూహంలో భాగంగా ఎన్నికలు, పదవులకు రాజీనామాలు, ఉప ఎన్నికలు అంటూ పకడ్బందీగా వ్యవహరించింది. కానీ రాష్ట్రం సిద్ధించాక జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రం సాధారణ మెజారిటీనే సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 60 స్థానాలుకాగా... 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అంతకు కేవలం మూడు సీట్లు ఎక్కువగా 63 స్థానాలను మాత్రమే గెలుచుకున్నది. బీఎస్పీ విలీనం ద్వారా ఇద్దరు సభ్యులు కలిశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కాంగ్రెస్ నుంచి నలుగురు, వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు, తెలంగాణ టీడీపీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా ప్రస్తుతం టీఆర్ఎస్ బలం 81 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది. అయితే ఉద్యమ పార్టీగా అత్యధిక స్థానాల్లో గెలవాల్సిన టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో తాము ఓడిపోయిన స్థానాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టిందని... ఆయా నియోజకవర్గాల్లో అంతో, ఇంతో జనబలమున్న నేతలపై దృష్టి పెట్టిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై అంచనాకు వచ్చిన గులాబీ నాయకత్వం ‘ఆపరేషన్ ఆకర్ష్’కు మరింత పదును పెడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ వాష్ ఔట్..! రాష్ట్రంలో టీడీపీ ఉనికి లేకుండా చేసే వ్యూహంలో భాగంగా ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకున్న టీఆర్ఎస్... వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచే జిల్లాల్లో పార్టీ బలం పెంచే పనిలో పడిందని... జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా హైదరాబాద్లో కుదురుకుందని పేర్కొంటున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ చేతిలో సగం చొప్పున స్థానాలు ఉండడంపై అధికార పార్టీలో చర్చ జరిగిందని అంటున్నారు. ఈ జిల్లాల్లోనూ పూర్తి ఆధిక్యం సాధించాలని, 2019 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కొందరు కాంగ్రెస్ సీనియర్లనూ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మహ బూబ్నగర్ జిల్లాలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలతో, కరీనంగర్ జిల్లాలో మరో టీడీపీ నేతతో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం. కాగా తెలంగాణ టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరనున్నారని, ముహూర్తం ఖరారు కావాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.