breaking news
Venkojipalem
-
వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం ధాటికి పొగ దట్టంగా అలుముకుంది. ఆసుపత్రి సెల్లార్లో యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది.దట్టంగా పొగ వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. -
15 నుంచి కొత్త విమాన సర్వీసులు
వెంకోజీపాలెం : విశాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త. ఢిల్లీ, ఛండీఘర్, జమ్ము నగరాలకు కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. ఈ సర్వీసులు వచ్చే నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎస్జి-224 విశాఖ-బెంగళూర్-ఢిల్లీ-ఛండీఘర్-జమ్ము విమానం ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూర్ నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వరదారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఛండీఘర్కు, 3.40 గంటలకు జమ్ముకు చేరుకుంటుందన్నారు. జమ్ములోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ విమానం సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు.