-
సమాఖ్య కాదు... యూనియన్!
మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇప్పుడున్న రాష్ట్రాలు లేవు. అప్పట్లో మద్రాస్, బెంగాల్, బాంబే ప్రెసిడెన్సీలు; బిహార్, ఒరిస్సా, పంజాబ్ వంటి ప్రావిన్స్లు; వందలాది సంస్థానాలు ఉండేవి. 1949 నవంబర్లో మన రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత వీటి స్థానంలో పరిపాలక విభాగాలుగా ‘రాష్ట్రాలు’ ఉనికిలోకి వచ్చాయి. రాజ్యాంగంలోని మొత్తం 395 ఆర్టికల్స్లో ఎక్కడా ‘సమాఖ్య లేదా సమాఖ్య తత్వం’(ఫెడరల్ లేదా ఫెడరలిజం) ప్రస్తావనే లేదు. స్వాతంత్య్రం రాకముందు ఫెడరల్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ కోర్టులు ఉండేవి. ఆ తర్వాత వాటి స్థానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సుప్రీంకోర్టులు వచ్చాయి. 1935 చట్టం ఒక విధమైన సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని పూర్తిగా సమాఖ్య అనలేం. రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం... పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా రాష్ట్రాలను విభజించడం కానీ, కలపడం కానీ, వాటి సరిహద్దులను మార్చడం కానీ చేయవచ్చు. ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల ఏర్పాటు ఇందుకు మంచి ఉదాహరణ. అదేవిధంగా జమ్మూ కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడమూ తెలిసిందే. సమాఖ్య రాజ్యంలో రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఉదాహరణకు అమెరికాలో ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక సంస్థ ఉంటుంది. అలాగే గవర్నర్లను ప్రజలే ఎన్నుకుంటారు. కానీ భారత్లో అలా కాదు. దీన్నిబట్టి మనది సమాఖ్య కాదు. బలమైన కేంద్రం ఉన్న యూనియన్ అని చెప్పవచ్చు. ఇటువంటి యూనియన్ ఉండాలనే అంబేడ్కర్, పటేల్ లాంటివారు వాంఛించారు. బలమైన కేంద్రం లేకపోతే రాష్ట్రాలు విడిపోయి దేశం ముక్కలవుతుందని వారు భావించారు. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) అందుకే రాజ్యాంగంలోని 356, 360, 362 ఆర్టికల్స్ రాష్ట్రాలపై కేంద్రానికి ఆధిపత్యాన్ని కట్ట బెట్టాయి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించగలగడం ఈ ఆధిపత్యాన్నే సూచిస్తుంది. 6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వంద పర్యాయాలకు పైగా రాష్టపతి పాలన విధించడం తెలిసిందే. రాజ్యాంగం... కేంద్ర అధికారాలు, రాష్ట్ర అధికారాలు, ఉమ్మడి అధికారాలు అని పేర్కొంటున్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్రం, రాష్ట్రాలు... రెండూ విడివిడిగా చట్టం చేస్తే అంతిమంగా కేంద్ర చట్టానిదే పైచేయి అవుతుందని రాజ్యాంగం పేర్కొంటున్నది. పైన పేర్కొన్న అనేక నిబంధనలు మనది సమాఖ్య రాజ్యం కాదనీ, యూనియన్ అనీ స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞాభారతి చైర్మన్ -
హనుమాన్ చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: బహుముఖ ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. 49వ వార్షికోత్సవాల్లో భాగంగా ‘ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్’ 2021–22 సంవత్సరానికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇటీవల నగరంలోని నోవాటెల్లో జరిగిన కార్యక్రమంలో డీఆర్డీఓ చైర్మన్ జి.సతీష్రెడ్డి, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డును జయతీర్థ్ ఆర్.జోషి (డిఫెన్స్ ఆర్ అండ్ డీ ల్యాబ్), ‘హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు ప్రవీణ్ తివారీ(పల్స్ ఫార్మా), ‘ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు దేశిరెడ్డి శ్రీనివాస్రెడ్డి (ఆప్టిమస్ డ్రగ్స్)లు అందుకున్నారు. ‘సీఎస్ఆర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’చిన్నబాబు సుంకవల్లి(గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్)కి, మంజూష కొడియాల(ఫార్మా ఆర్ అండ్ డీ)కి ‘యంగ్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’, ఉమ కాసోజి(ది స్టార్ ఇన్మి)కి ‘ఉమెన్ అచీవర్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’, ప్రొఫెసర్ రామచంద్ర(జేఎన్టీయూ)కు ‘అకడమీషియన్ ఎక్సలెన్స్’పి.కృష్ణ చైతన్య(మోటివేషనల్ స్పీకర్)కు ‘మెంబర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను ప్రదానం చేశారు. -
124–ఏ సెక్షన్ను ఎందుకు రద్దు చేయాలి?
‘‘ఇండియా తేరే తుకడే తుకడే కరేంగే’’ అని ఊరేగింపులలో బహిరంగంగా అరవడం దేశద్రోహం కాకపోతే, మరేమిటి? భారత పార్లమెంటుపై హంతక దాడికి పాల్పడిన ఉగ్ర వాదులనూ, వారిని ప్రేరేపించిన వారినీ, వారికి శిక్షణ ఇచ్చిన వారినీ హీరోలుగా కీర్తించడం దేశద్రోహం అవ్వక మరే మౌతుంది? ప్రభుత్వాన్ని పడగొట్టి శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించే లక్ష్యంతో సొంత బలగాలను పెంచుకోవడం, సైన్యం దేశరక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వారిపై దొంగ దాడులకు పాల్పడటం దేశద్రోహం కాకపోతే మరింకేమిటి? ముస్లింలు సురక్షితంగా ఉండేందుకూ, వారికి స్వయం పాలన ఒనగూడేందుకూ భారతదేశాన్ని మరోసారి విభజించి మొఘలి స్థాన్ను సృష్టించాలని ఒక ప్రొఫెసర్ రాస్తే అది దేశద్రోహం కాకుండా ఎలా ఉంటుంది? హత్య, అత్యాచారం, దోపిడీ అనేవి 150 ఏళ్లకు పైగా ఉన్న భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేటికీ శిక్షార్హమే అయినప్పుడు ఆ కాలం నాటిదే అయిన 124–ఏ సెక్షన్ను ఎందుకు రద్దు చేయాలి? (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) వలస పాలకుల కాలంలో 150 ఏళ్ల క్రితం నేరాలుగా పరి గణన పొందినవి నేడెలా నేరం కాకుండా పోతాయి? భారతదేశంలో దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక, విదేశీ ప్రేరక... వ్యక్తులూ, సిద్ధాంత కర్తలూ, కార్యకర్తలూ ఉన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛా భారతాన్ని వారి నుంచి రక్షించడానికి దేశద్రోహ ప్రసంగాలను, రచనలను, ప్రచారాలను, చర్యలను గుర్తించాలి, గమనించాలి, శిక్షించాలి. అందుకోసం రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 124–ఏను కొనసాగించాలి. న్యాయబద్ధంగా నిందితులను విచారించాలి. దోషులకు శిక్షలు విధించాలి. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజుజు దృఢ వైఖరి సరైనది, ప్రశంసనీయమైనది. (క్లిక్: దేశద్రోహం కేసు నిందితుడిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా) – డాక్టర్ టి. హనుమాన్ చౌదరి; చైర్మన్, ప్రజ్ఞాభారతి -
వివేకంతో వ్యవహరించాల్సిన క్షణం
గతవారం రోజులుగా ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న బహుముఖ సైనికదాడికి చారిత్రక కారణాలు అనేకం తోడయ్యాయి. ఏయే దేశాలు గడచిన కొన్ని దశాబ్దా లుగా ఇతర దేశాలపై దురాక్రమణకు దిగాయో పరిశీలిస్తే ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి. సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు దేశాలైన చెకొస్లొ వేకియా, హంగరీ, పోలండ్, తూర్పు జర్మనీలను దాదాపుగా ఆక్రమించి తన గుప్పిట్లో పెట్టుకుంది. కమ్యూనిస్టు చైనా కమ్యూనిస్టు వియత్నాంపై దురాక్ర మణ దాడికి దిగింది. కమ్యూనిస్టు వియత్నాం తోటి కమ్యూనిస్టు దేశమైన లావోస్పై దాడిచేసి అవమానకరమైన ఓటమితో వెనుదిరిగింది. రష్యా, చైనా, వియత్నాం చేస్తూవచ్చిన దురాక్రమణ దాడులు సామ్రాజ్యవాద స్వభావంతో కూడుకుని ఉన్నాయి. సోషలిజం, కమ్యూనిజం అనేవి ముసుగులు మాత్రమే. ఈ దాడుల వెనుక కీలకాంశం ఆధిపత్యం, అధికారం తెచ్చిపెట్టిన అహంకారం. మరోవైపు చూద్దాం. వియత్నాంపై దాడి చేసిన అమెరికా కార్పెట్ బాంబింగ్ ద్వారా చరిత్ర మర్చిపోలేనంత విధ్వంసాన్ని సృష్టించింది. కానీ దివంగత వియత్నాం నేత హోచిమిన్, జనరల్ జాప్ నాయకత్వంలో వియత్నాం ప్రజలు తలపెట్టిన జాతీయవాద ప్రతిఘటనను అమెరికా అడ్డు కోలేకపోయింది. అమెరికా అధికార అహంకారంపై వియత్నాం జాతీయవాదం ఘన విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ను అమెరికా ఆక్రమించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు అఫ్గాన్లు అమెరికా సైన్యాన్ని ప్రతిఘటిస్తూ వచ్చారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ బేషరతుగా తన సైన్యాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించు కున్నారు. విదేశీ దురాక్రమణపై జాతీయ ప్రతిఘటన ముందు అమెరికా అగ్రరాజ్యం తలవంచింది. అలాగే, పూర్వ సోవియట్ యూనియన్ కూడా అఫ్గానిస్తాన్ను దురాక్రమించింది. అక్కడి స్థానిక ప్రభుత్వాన్ని దింపి తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. ఏడేళ్ల పాటు సాగిన ప్రజాపోరాటంలో చివరకు అంత పెద్ద కమ్యూనిస్టు అగ్రరాజ్యం కూడా అఫ్గాన్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పూర్వ సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టు సామ్రాజ్యవాద శక్తి. ముస్లిం సెంట్రల్ ఆసియన్ రిపబ్లిక్కులతోపాటు ఆర్మేనియా, బెలారుస్, ఉక్రె యిన్ కూడా రష్యన్ సామ్రాజ్యవాద పాలనకు లోబడి కమ్యూనిస్టు ప్రభుత్వా లను ఏర్పర్చాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే ఉక్రెయిన్కు భద్రతా మండలిలో స్థానం కావాలని యూఎస్ఎస్ఆర్ డిమాండ్ చేసింది. దీనికి ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు. అదే ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. రష్యా, దాని అధీన దేశాలు, కమ్యూనిస్టు చైనా ఒకవైపు... అమెరికా దాని మిత్రదేశాలు ఒకవైపు నిలబడి తలపడ్డాయి. సోషలిజం, కమ్యూనిజం పేరిట కమ్యూనిస్టు శక్తులు... ప్రజాస్వామ్యం పేరిట అమెరికా, పాశ్చాత్య యూరోపియన్ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్య ఆకాంక్షలతోటే పలుమార్లు దురాక్రమణ యుద్ధాలకు తలపడ్డాయని చరిత్ర మనకు సూచిస్తోంది. భారతదేశం తొలినుంచి సందిగ్ధావస్థలో ఉండిపోయింది. అప్పటి సోవి యట్ యూనియన్, తర్వాత రష్యా 1950ల నుంచి భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూటమిలో చేర కుండా ఇండియాను నిలవరించడమే దీని ఉద్దేశం కావచ్చు. అనేక సందర్బాల్లో పాకిస్తాన్, చైనాలు ఐరాస భద్రతా సమితిలో భారత్కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలకు వ్యతిరేకంగా యూఎస్ఎస్ఆర్, రష్యా వీటో పవర్ ఉపయోగించి ఆదుకున్న మాట వాస్తవం. తనను ఎన్నోసార్లు ఆదుకున్న రష్యాను దురాక్రమణదారుగా ఆరోపించి తప్పుపట్టడం మనదేశానికి బాధ కలిగించేదే అవుతుంది. కానీ ప్రస్తుతం చిన్న దేశమైన ఉక్రెయిన్పై శక్తిమంతమైన రష్యా దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా భారత ప్రజలు ఉద్వేగంతో ఉక్రెయిన్కు మద్దతిస్తున్నారు. అమెరికా, నాటో సభ్యదేశాలు శక్తిమంతమైన రష్యాపై విధించే ఆంక్షలు పెద్దగా పనిచేయకపోవచ్చు. అవసరమైతే ఉక్రెయిన్పై అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా పుతిన్ వెనుకాడడు. మనందరం సంక్షోభ కాలంలోనే జీవిస్తున్నాం. బలమైన చైనాతో భారత్ తలపడుతోంది. అయితే ఉక్రెయిన్, ఫిన్లాండ్లు అంత చిన్న దేశం కాదు. మన మిత్రదేశం, మనకు ప్రయోజనకరంగా ఉండే దేశం ఇప్పుడు దురాక్రమణ దారుగా ముద్ర పడుతున్నప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించడానికి ఎంతో వివేకం, జ్ఞానం అవసరమవుతాయి. వాస్తవానికి ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించడానికి మూల కారణం నాటో. పొరుగు దేశం నాటో కూటమిలో చేరితే తన భద్రతను కాపాడుకోవలసిన అవసరం రష్యాది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో భారత్ జాగ్రత్తగా అడుగులు వేయ వలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి ఛైర్మన్, ప్రజ్ఞా భారతి -
ఆభరణాల తనిఖీ ఆగమశాస్త్ర బద్ధమేనా?
తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల టీటీడీ బోర్డు నిర్వాకంపై, చంద్రబాబు ప్రభుత్వ ధార్మిక వ్యతిరేక పాలనపై, తిరుమల ఆలయంలో అవినీతిపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణదేవరాయల కాలం నాటి స్వామివారికి అర్పించిన అమూల్య ఆభరణాలు మాయమైపోయాయని, అత్యంత విలువైన ఆభరణాలను అంతర్జాతీయ వేలం పాటల్లో అమ్మకానికి పెడుతున్నారని సాక్షాత్తూ ఆలయ ప్రధాన అర్చకులే ఆరోపించడం తీవ్రమైన విషయం. దానికి తక్షణ చర్యగా ఆయనను ప్రధాన అర్చకత్వ బాధ్యతలనుంచి తొలగించి ఆలయ మండలి సభ్యత్వంనుంచి కూడా తీసివేసిన టీడీపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు ఇప్పుడు ఈ తీవ్ర ఆరోపణలపై విచారణను పక్కనబెట్టడానికి ఆగమ శాస్త్రాన్ని సాకుగా తీసుకోవడం దారుణం. శ్రీవేంకటేశ్వరుడి అమూల్య మైన ఆభరణాలను సామాన్య ప్రజానీకానికి చూపిం చడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదని టీటీడీ అధికారులూ, సంబంధిత ప్రభుత్వాధికారులు, మంత్రులు కలిసి కట్టుగా చెబుతున్నారు. బోర్డు సభ్యులు ఆభరణాలను నిశితంగా పరిశీలించారని, ఆభరణాలు ఏవీ పోలేదని, అన్నీ ఉన్నాయని నిర్ధారించేశారు. కాబట్టే శ్రీవారి ఆభరణాల చౌర్యంపై ఏ విచారణా అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకన్నా ముఖ్యవిషయం ఏమిటంటే టీటీడీ సభ్యుల అర్హతలు ఏమిటన్నదే. తిరుమల తిరుపతి దేవస్థాన మండలి సభ్యులుగా తమ పార్టీకి సహాయ సహకారాలు అందించిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తున్నారు. వీరిలో కొంతమంది నల్లధనం దాచుకుని, పట్టుబడ్డవారు, కొంతమంది కల్లు, సారాయి దుకాణాలను పెట్టుకున్నవారు, కొంతమంది లారీ వ్యాపారాలు చేసేవారు. ఇలాంటి తరహా సభ్యులు వేంకటేశ్వరస్వామి ఆభరణాలను పరిశీలించడానికి ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా? ఈ వ్యాపారులేమైనా విశిష్టమైన దైవభక్తులా? ప్రజలను తప్పుదారి పట్టించకుండా, అన్ని అనుమానాలను నివారించడం కోసం హైకోర్టు న్యాయమూర్తులచే కాకుండా, సీబీఐ ద్వారానే విచారణ చేయడం సముచితంగా ఉంటుంది. త్రిపురనేని హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్ మొబైల్ : 98490 67359
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement