breaking news
triple talaq victim
-
మోదీకి రాఖీ కట్టిన ట్రిపుల్ తలాక్ పిటిషనర్
కోల్కతా: ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఐదుగురిలో ఒకరైన పశ్చిమ బెంగాల్ మహిళ ఇష్రత్ జహాన్ గురువారం ఢిల్లీకి వచ్చి మోదీకి రాఖీ కట్టారు. తక్షణ ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించేలా చట్టాన్ని తెచ్చినందుకు ముస్లిం సోదరిల తరఫున ఆమె మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. త్రివర్ణాలతో ఉన్న రాఖీని మోదీ చేతికి కట్టే అవకాశం వచ్చినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే తాను కోల్కతా నుంచి తెచ్చిన రసగుల్లాను భద్రతా కారణాల వల్ల మోదీకి ఇవ్వలేకపోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు. కోల్కతాలోని హౌరాలో నివసించే ఇష్రత్ జహాన్కు దుబాయ్లోని తన భర్త 2014లో మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ను రద్దు చేయగా, ఆ చర్యను నేరంగా పరిగణించేలా కేంద్రం చట్టం తెచ్చింది. -
ప్రధాని మోదీకి లక్నో మహిళ లేఖ
లక్నో: ఇస్లాంలో కొనసాగుతున్న ట్రిఫుల్ తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన బాధితురాలు ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి మొర పెట్టుకుంది. ఈ దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడాలని కోరుతూ ప్రధానికి లక్నో మహిళ షాగుఫ్తా షా లేఖ రాసింది. ట్రిఫుల్ తలాక్ ను రద్దు చేస్తారని తాను బీజేపీకి ఓటు వేశానని వెల్లడించింది. అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించడంతో తనను భర్త వదిలేశాడని తెలిపింది. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందన్న భయంతో తన భర్త షంషాద్ సయాద్ అబార్షన్ చేయించాలనుకున్నాడని తెలిపింది. తాను ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితం హింసించి ఇంటి నుంచి గెంటేశాడని, ట్రిఫుల్ తలాక్ చెప్పి తనను వదిలించుకున్నాడని వివరించింది. షారంగ్ పూర్ ప్రాంతానికి చెందిన షాగుఫ్తాకు సహాయం అందించేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. అయితే ప్రధాని అయితేనే తనకు న్యాయం చేయగలరన్న ఉద్దేశంతో ఆయనకు ఆమె లేఖ రాసింది. ‘పేద, నిస్సహారాయులి మొర ఆలకించాలని ప్రధానమంత్రిని కోరుతున్నా. నాలాంటి వాళ్లకు న్యాయం జరగాలంటే ఈ దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడాలి. అప్పుడే మేమంతా గౌరవడం బతక గలుగుతామ’ని లేఖలో పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జిల్లా కలెక్టర్, జాతీయ మహిళా కమిషన్ కు కూడా లేఖ ప్రతులు ఆమె పంపించింది.