breaking news
TRAI recommendations
-
స్పెక్ట్రం చార్జీ @ 4 శాతం ఆదాయం
న్యూఢిల్లీ: స్టార్లింక్లాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్కామ్) కంపెనీలు అడుగుతున్న దానికంటే అధిక స్థాయిలో స్పెక్ట్రం చార్జీలు విధించేలా కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు చేసింది. కంపెనీల సవరించిన ఆదాయాల్లో (ఏజీఆర్) 4 శాతాన్ని చార్జీగా నిర్ణయించాలని పేర్కొంది. ప్రతి మెగాహెట్జ్కి వార్షికంగా విధించే రూ. 3,500 స్పెక్ట్రం చార్జీకి ఇది అదనంగా ఉంటుంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సరీ్వసులు అందించే ఆపరేటర్లు, ప్రతి యూజరుపై అదనంగా ఏటా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు మాత్రం అదనంగా చార్జీలేమీ ఉండవు. టెలికం శాఖకు (డాట్) ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. స్పెక్ట్రంను కంపెనీలకు అయిదేళ్ల పాటు కేటాయించాలని, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. శాట్కామ్ సరీ్వసులు ప్రారంభమైతే టెలికం నెట్వర్క్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. శాట్కామ్ కంపెనీలు అభ్యరి్ధస్తున్న రేటు కంటే ట్రాయ్ సిఫార్సు చేసిన చార్జీలు గణనీయంగా అధికంగా ఉండటం గమనార్హం. స్పెక్ట్రం చార్జీని ఏజీఆర్లో 1 శాతం కన్నా తక్కువగానే ఉంచాలని, అదనంగా చార్జీలేమీ విధించొద్దని ట్రాయ్తో సంప్రదింపుల సందర్భంగా స్టార్లింక్, అమెజాన్కి చెందిన క్విపర్ సిస్టమ్స్ కోరాయి. ఎయిర్టెల్ భాగస్వామిగా ఉన్న యూటెల్శాట్ వన్వెబ్, జియో ప్లాట్ఫామ్స్కు ఇప్పటికే శాట్కామ్ సేవల లైసెన్సులు లభించాయి. స్టార్లింక్ తుది లైసెన్సు తీసుకునే దశలో ఉంది. -
3జీ స్పెక్ట్రం... బేస్ ధర రూ. 2,720 కోట్లు
కేంద్రానికి ట్రాయ్ సిఫార్సులు న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా దేశవ్యాప్త 3జీ స్పెక్ట్రం వేలం ధరను ప్రతి మెగాహెట్జ్కి రూ. 2,720 కోట్లుగా నిర్ణయించాలని టెలికం విభాగానికి (డాట్) సిఫార్సు చేసింది. 2010లో మొబైల్ ఆపరేటర్లు చెల్లించిన మొత్తానికన్నా ఇది 19 శాతం తక్కువ. అయితే, క్రితం 3జీ వేలం రిజర్వ్ ధరతో పోలిస్తే మాత్రం నాలుగు రెట్లు అధికం. మరోవైపు, 1900 మెగాహెట్జ్ బ్యాండ్విడ్త్ స్పెక్ట్రంకి బదులుగా రక్షణ శాఖ నుంచి అదనంగా లభించబోయే 15 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కూడా వేలం వేయాల్సిందిగా ట్రాయ్ సూచించింది. రక్షణ శాఖతో సూత్రప్రాయ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇది తక్షణమే చేతికి రాకపోయినప్పటికీ వేలం వేసేయొచ్చని పేర్కొంది. ప్రతి లెసైన్సు సర్వీస్ ఏరియాలో (ఎల్ఎస్ఏ) 2,100 మెగాహెట్జ్ బ్యాండ్విడ్త్ (3జీ) స్పెక్ట్రం బేస్ ధర రూ. 2,720 కోట్లుగా నిర్ణయించాలని పేర్కొంది. ఎల్ఎస్ఏలో 3-4 బ్లాకులు ఉన్న పక్షంలో ఏ బిడ్డరు కూడా 2 బ్లాకులకు మించి బిడ్డింగ్ వేయకుండా పరిమితి విధించాలని తెలిపింది. వేలంలో విజేతలుగా నిల్చిన టెలికం ఆపరేటర్లు ..స్పెక్ట్రం కేటాయింపులు జరిపినప్పట్నుంచీ మూడేళ్లలోగా నెట్వర్క్ను సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. గతంలో ఇది అయిదేళ్లుగా ఉండేది. అటు ఎస్-టెల్కు మూడు సర్వీస్ ఏరియాల్లో (బీహార్, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్) కేటాయించిన స్పెక్ట్రంను కూడా వేలం వేయాలని ట్రాయ్ సూచించింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో సుప్రీం కోర్టు 122 లెసైన్సులు రద్దు చేయడంతో ఎస్టెల్ భారత్లో వ్యాపార కార్యకలాపాలు నిలిపివేసింది. 800,900, 1,800 మెగాహెట్జ్ బ్యాండ్విడ్త్లలో ఫిబ్రవరిలో స్పెక్ట్రం వేలం జరగనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు 2,100 మెగాహెట్జ్ బ్యాండ్ విడ్త్ స్పెక్ట్రం కూడా వేలం వేయాలని డాట్ యోచిస్తోంది. ట్రాయ్ సిఫార్సులను డాట్.. టెలికం కమిషన్కు సమర్పిస్తుంది. అది.. టెలికం శాఖకు అభిప్రాయం తెలియజేస్తుంది. మరోవైపు, ట్రాయ్ సిఫార్సులు సరైన దిశలో ఉన్నాయని టెలికం సంస్థ యూనినార్ అభిప్రాయపడింది.