Towhid Hridoy
-
ఆసీస్ సిరీస్ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా
త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, ఆతర్వాత జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం రెండు వేర్వేరు బంగ్లాదేశ్ జట్లను ఇవాళ (జూన్ 11) ప్రకటించారు. ముందుగా ఆసీస్తో టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా యువ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ పేరును ప్రకటించారు.ఈ సిరీస్తో పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా రీఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురు పేసర్లతో బంగ్లాదేశ్ ఆసీస్ బ్యాటింగ్ యూనిట్పై దాడికి దిగనుంది. ఈ జట్టులో గత సిరీస్లో ఆడిన తంజిమ్ హసన్ షకీబ్, రిపన్ మొండల్, మొహమ్మద్ సైఫుద్దీన్లకు చోటు దక్కలేదు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా వీరిని తప్పించినట్లు సెలెక్టర్లు చెప్పారు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్ విషయానికొస్తే.. నజ్ముల్ హసన్ షాంటో కెప్టెన్గా కొనసాగనున్నాడు. దేశవాలీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న తౌహిద్ హృదోయ్ టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్లు ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, మొమినుల్ హక్ జట్టులో చోటు నిలుపుకున్నారు. కొత్త పేసర్ రోబివుల్ హాక్కు అవకాశం లభించింది.ఆసీస్తో మూడు మ్యాచ్ టీ20 సిరీస్ జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగనుండగా.. జింబాబ్వేతో ఏకైక టెస్ట్ జూన్ 28 నుంచి హరారేలో జరుగనుంది.ఆస్ట్రేలియా సిరీస్కు బంగ్లా టీ20 జట్టు: లిటన్ కుమార్ దాస్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, అబ్దుల్ గఫార్ సక్లైన్.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్, ఇబాడోత్ హొసేన్, హసన్ మహమూద్, తౌహిద్ హృదోయ్, అమిటే హసన్, రోబివుల్ హాక్. -
న్యూజిలాండ్కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్, ఇవాళ (ఏప్రిల్ 27) ప్రారంభమైన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఘనంగా బోణీ కొట్టింది. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్రత్యర్దిని 182 పరుగులకు (6 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కేటీన్ క్లార్క్ (51), డేన్ క్లీవర్ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్ క్లార్క్సన్ (27 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకీబ్, మెహిది హసన్ తలో వికెట్ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తౌహద్ హృదోయ్ (51 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్కు పర్వేజ్ హొసేన్ (28), షమీమ్ హొసేన్ (31 నాటౌట్) సహకరించారు. మిగతా ఆటగాళ్లలో సైఫ్ హసన్ 17, తంజిద్ హసన్ 20, కెప్టెన్ లిటన్ దాస్ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఐష్ సోధి 2, జోష్ క్లార్క్సన్, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 29న జరుగనుంది. -
ఇదేందయ్యా ఇది.. ఇంత చెత్త ఫీల్డింగ్!.. గొప్పలకేమీ తక్కువలేదు
బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్తో విమర్శల పాలైంది. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్లో ఉండీ.. అప్పటికి ఫీల్డర్ బంతిని తన చేతుల్లోకి తీసుకున్నా.. రనౌట్ చేసే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకుంది. ఎట్టకేలకు పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కడం వల్ల సరిపోయింది గానీ లేదంటే.. ఈ చెత్త ఫీల్డింగ్ కారణంగా పాక్ ఫైనల్ అవకాశం చేజారేదే!అసలేం జరిగిందంటే.. ఆసియా టీ20 కప్-2025 సూపర్-4లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ గురువారం బంగ్లాదేశ్ (PAK vs BAN)తో తలపడింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫైనల్కు అర్హతఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హ్యారిస్ (31), మొహమ్మద్ నవాజ్ (25) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో పదకొండు పరుగుల తేడాతో పాక్ గెలుపొంది.. ఫైనల్కు అర్హత సాధించింది.అయితే, బంగ్లా ఇన్నింగ్స్లో ఐదో ఓవర్లో షాహిన్ ఆఫ్రిది బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతిని తౌహీద్ హృదయ్ (Towhid Hridoy) ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సయీమ్ ఆయుబ్ (Saim Ayub) బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపాడు.రనౌట్ అవకాశం మిస్కానీ అప్పటికే మరో ఎండ్లో ఉన్న సైఫ్ హసన్ తౌహీద్ హృదయ్ వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్ట్రైకర్ ఎండ్లో ఉండగా.. ఆయుబ్ బౌలర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. అయితే, మిస్ ఫీల్డ్ అయింది. బంతిని అందుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. మిడాన్లో ఉన్న ఫీల్డర్ వచ్చి బంతిని అందుకోవాల్సి వచ్చింది.ఇంతలో సైఫ్ వేగంగా తన స్థానంలోకి వచ్చేశాడు. దీంతో రనౌట్ అవకాశం మిస్సవగా.. ఆయుబ్ ముఖం మాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్పై విజయం తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. తమ ఫీల్డింగ్ అద్భుతమంటూ కొనియాడాడు.గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదుఈ నేపథ్యంలో రనౌట్ చాన్స్ మిస్ చేసిన ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘చెత్త ఫీల్డింగ్.. గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదు’’ అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాక్ ఫీల్డర్ల కారణంగా లైఫ్ పొందిన బంగ్లా ఓపెనర్ సైఫ్ హసన్ 18 పరుగులే చేయగలిగాడు. మరోవైపు.. తౌహీద్ హృదయ్ (5) కూడా ఫెయిలయ్యాడు. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక బంగ్లాపై గెలిచిన పాక్.. సెప్టెంబరు 28న టీమిండియాతో ఫైనల్లో తలపడుతుంది.చదవండి: సూర్య... అలాంటి వ్యాఖ్యలొద్దుBoth batters at the same end but still survive 😲Watch #PAKvBAN Live now on the Sony Sports Network TV channels Sony LIV. #SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/b6tXLSMI1d— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025


