-
టీచర్ ఫెయిల్..!
కేంద్రం చెప్పిందిది.. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించి ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఎడ్, టెట్ అర్హతలు తదితర అన్ని వివరాలను తీసుకోవాలి. వీటిని ఆధార్తో అనుసంధానం చేసి ఒక పాఠశాలలో పనిచేసే టీచర్ మరో పాఠశాలలో లేకుండా చూసేందుకు (డూప్లికేషన్) ఆన్లైన్ లింకేజీ చేయాలని స్పష్టం చేసింది. 2010లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను అమల్లోకి తెచ్చినపుడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలంటే సదరు అభ్యర్థి టెట్లో అర్హత సాధించా లన్న నిబంధనను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) విధించింది. అయితే ప్రభుత్వాలు ఇన్నాళ్లూ ఆ నిబంధన విషయంలో సీరియస్గా వ్యవహరించలేదు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న ఓ కార్పొరేట్ స్కూల్లో 950 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో దాదాపు 35 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో 10 మంది వరకు టీచర్లకు నెలవారీ వేతనం రూ.10 వేల లోపే. కారణం వారిలో ఎక్కువ మందికి డీఎడ్ లేదా బీఎడ్ లేకపోవడం, ఇంకొందరు టెట్లో అర్హులు కాకపోవడం. ఇలాంటి టీచర్లు రాష్ట్రంలో వందల స్కూళ్లలో వేల సంఖ్యలో పనిచేస్తున్నట్లు విద్యా శాఖ అం చనా. ఐఐటీ చదువులు.. సింగిల్ డిజిట్ ర్యాంకులు అంటూ ఆకర్షణీయంగా ఎరవేస్తాయి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు. వేలకు వేలు ఫీజులు చెల్లించి పిల్లలను చేరి్పస్తే ఆశించిన చదువులు మాత్రం రావడం లేదు. ఎందుకలా అంటే.. అందులో శిక్షణ పొం దిన ఉపాధ్యాయులే ఉండరు. ఏదో ఇంటరో.. డిగ్రీ సర్టిఫికెటో పట్టుకుని టీచర్లుగా పనిచేస్తుంటారు. ఇలాంటి వారికి వేతనం కూడా రూ.10వేల లోపే. ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారే ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో అక్రమాలకు తావులేకుండా ఆధార్ను అనుసంధానం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఆధార్తో లింక్... ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆధార్ ఆధారిత టీచర్ల లెక్కలు ఇకపై ప్రైవేటు స్కూళ్లు చెప్పాల్సిందే. 2019–20 విద్యాశాఖ లెక్కల సేకరణలో (యూ–డైస్) కచ్చితంగా ఆ వివరాలు ఇవ్వాల్సిందే. విద్యార్థుల సంఖ్యకు, ఉపాధ్యాయులకు సంఖ్య సరిపోలాల్సిందే. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉందా? లేదా? అడ్డగోలు ప్రవేశాలు చేపడుతున్నారా? అన్నది తేల్చేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్ధమైంది. దీంతో అర్హతల్లేని టీచర్లకు చెక్ పడనుంది. అర్హులైన వారితోనే బోధన చేపట్టేలా కార్యాచరణను అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నవంబర్ నుంచి చేపట్టనున్న 2019–20 యూ–డైస్లో ప్రైవేటు పాఠశాలకు చెందిన టీచర్ల సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందేనని, అదీ ఆన్లైన్లో ఆధార్తో లింక్ చేయడం డూప్లికేషన్ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. పక్కాగా చర్యలు చేపట్టినా.. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే వారు కచి్చతంగా సుశిక్షితులైన వారే ఉండాలని కేంద్రం 2017 ఆగస్టులో స్పష్టం చేసింది. 2019, మార్చి 31 నాటికి పాఠశాలల్లో పని చేసే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన వారై ఉండాలని సూచించింది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో పని చేస్తున్న వారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఉపాధ్యాయ విద్యను అభ్యసించేలా అవకాశం కల్పించింది. అయితే పాఠశాలల్లో వారు బోధిస్తున్నట్లు సరి్టఫై చేసిన వారికే ప్రవేశాలు కల్పించింది. మొదట్లో 3,905 మంది మాత్రమే అన్ట్రైన్డ్ టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు వేసినా, ఓపెన్ స్కూల్లో ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు అర్హత ఉందంటూ ఆధారాలతో 17 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకుని చదువుకున్నారు. రికార్డుల్లో లేని వారు 33 వేలపైనే.. పాఠశాలల రికార్డుల్లో లేకపోయినా టీచర్లుగా పని చేస్తున్న వారు మరో 33 వేల మందికి పైగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. వారికి ఉపాధ్యాయ విద్య అర్హతలు లేనందున రికార్డుల్లో చూపడం లేదు. మరోవైపు మరికొంత మందికి తక్కువ వేతనాలు ఉండటంతో వోచర్ పేమెంట్ల సరిపుచ్చుతున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. ఇక టెట్లో అర్హత సాధించని వారైతే 64 శాతం ఉన్నట్లు విద్యాశాఖ పరిశీలనల్లోనే తేలింది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో విద్యా బోధన చేస్తున్న టీచర్ల లెక్కలను పక్కాగా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. -
చిగురంత ఆశ
రాయవరం : రెండేళ్లుగా ఊరిస్తున్న డీఎస్సీ సెప్టెంబర్ ఐదున జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టెట్లో క్వాలిఫై అయినవారికి మాత్రమే డీఎస్సీలో అవకాశం కల్పిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. డీఎడ్, బీఎడ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నూతన బ్యాచ్ విద్యార్థులు డీఎస్సీకి అవకాశం కల్పించాలని ఆందోళన బాటపట్టారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో సుమారు 1,800 మంది డీఎడ్ చేస్తున్న వారు ఉండగా సుమారుగా 4,200 మంది బీఎడ్ శిక్షణ పూర్తి చేసుకుని పోటీ ప్రపంచంలో అడుగిడబోతున్నారు. గత మార్చి 16న జరిగిన టెట్లో 19,921 మంది బీఎడ్ పూర్తి చేసినవారు పాల్గొనగా డీఎడ్ పూర్తి చేసినవారు 2,234 మంది పాల్గొన్నారు. ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్కు అవకాశం ఉంటుందా?... డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీఎడ్ విద్యార్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. డీఎస్సీ 2014 నోటిఫికేషన్లోఎస్జీటీ పోస్టుల భర్తీలో తమకు అవకాశం కల్పిస్తారని బీఎడ్ అభ్యర్థులు ఆశిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య బోధించేందుకు కనీసం రెండేళ్లు కాలపరిమితి ఉన్న ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారే అర్హులనే నిబంధన ఉండడంతో సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీలో బీఎడ్ విద్యార్థులకు ఎలా అవకాశం కల్పిస్తారని డీఎడ్ అభ్యర్థ్ధులు ప్రశ్నిస్తున్నారు. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఆ తీర్పును పునః సమీక్షించాలంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) నియమ నిబంధనలను మార్చాల్సి ఉంటుందని బీఎడ్ అధ్యాపకుడు బొడ్డపాటి సురేష్కుమార్ తెలిపారు. ఆమేరకు చర్యలు చేపడితేనే బీఎడ్ చేసినవారికి ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం లభిస్తుంది. పెరిగిన ఖాళీల భర్తీ ఉంటుందా ? జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు నోటిఫికేషన్ సమయానికి ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది 184 ప్రాథమికోన్నత పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చి ఎనిమిదో తరగతిని నూతనంగా ప్రవేశపెట్టారు. ఆయా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఖాళీలు 1,211 ఈ ఏడాది మే నెలాఖరు నాటికి జిల్లాలో 1,211 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా సమాచారం. 190 స్కూల్ అసిస్టెంట్లు, 884 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 118 భాషా పండితులు, 19 వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేదల అక్షరంపై కక్ష
పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు
కాంగ్రెస్లో కౌన్సిలర్ల చేరిక
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
‘మరోసారి ప్రధానిగా మోదీ’
ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు
గ్రీన్బక్కెట్ పార్శిల్ హోటల్లో చోరీ
‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’
ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు
నేతకాని కార్పొరేషన్ కాంగ్రెస్తోనే సాధ్యం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement