breaking news
Terrorist David Coleman Headley
-
ఇష్రత్ గురించి వ్యక్తిగతంగా తెలియదు: హెడ్లీ
ముంబై: ఇష్రత్ జహాన్ గురించి తనకు వ్యక్తిగతంగా తెలియదని, ఆమె కేసు వివరాలను మీడియా ద్వారానే తెలుసుకున్నానని పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ముంబై దాడుల కేసులో ఆయన శనివారం ముంబై కోర్టు అమెరికా నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్లో ఈమేరకు తెలిపాడు.ఇష్రత్ లష్కరే తోయిబా తరఫున పనిచేసిందని హెడ్లీ గత నెల ఇదే కోర్టుకు చెప్పడం గమనార్హం. ‘లఖ్వీ(లష్కరే కమాం డర్) నాకు ముజామిల్ భట్ను పరిచయం చేశాడు. లష్కరే టాప్ కమాండర్లలో భట్ ఒకరని నాతో చెప్పాడు. అక్షరధామ్, ఇష్రత్ జహాన్ వంటి ఆపరేషన్లను చేపట్టాడన్నాడు. మిగతాదంతా నా ఆలోచనే’ అని హెడ్లీ తెలి పాడు. భారత్లో హతమైన లష్కరే సభ్యురాలు ఇష్రత్ అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి చెప్పానని, ఆ సంస్థ ప్రకటనలో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదో తనకు తెలియదన్నాడు. ఇషత్ ్రసహా నలుగురు 2004లో గుజరాత్లో జరిగిన ఎన్కౌంటర్ చనిపోవడం, నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ హత్యకు వీరు కుట్రపన్నారని ఆరోపణలు ఉండడం తెలిసిందే. -
వారిని పాక్ ఏమీ చేయదు..
ముంబై దాడుల కేసులో సయీద్, లఖ్వీలపై లష్కరే, అల్ కాయిదా అంచనా: హెడ్లీ ముంబై: ముంబై దాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్లపై పాకిస్తాన్ పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుందని లష్కరే తోయిబా, అల్ కాయిదాలకు తెలుసని దాడుల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ఆ దాడుల తర్వాత కొన్ని నెలల్లోలోపు భారత్లో మరో ఉగ్ర దాడికి ప్రణాళిక రచించామని శనివారమిక్కడి కోర్టుకు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపాడు. సోమవారం ప్రారంభమైన అతని వాగ్మూలం శనివారం ముగిసింది. ఈ విచారణను నిందితుడు అబు జుందాల్ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వాయిదా వేసింది. ముంబై దాడుల తర్వాత సయీద్, లఖ్వీల భద్రతపై ఆందోళన చెందానని, దీనిపై లష్కరే కీలక వ్యక్తి సాజిద్ మీర్, అల్ కాయిదా సభ్యుడు అబ్దుల్ పాషా (గతంలో లష్కరే)తో సంప్రదింపులు జరిపానని హెడ్లీ వెల్లడించాడు. హెడ్లీ ఇంకా ఏం చెప్పాడంటే.. ► పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎఫ్ఐఏ) లష్కరే సభ్యులను విచారిస్తున్న సమయంలో ‘ఓల్డ్ అంకుల్’(సయీద్), ‘యంగ్ అంకుల్’(లఖ్వీ) ఎలా ఉన్నారని మీర్ను అడిగా. యంగ్ అంకుల్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని మీర్ బదులిచ్చాడు. ఓల్డ్ అంకుల్ కూడా ఆరోగ్యంగా ఉన్నాడని అన్నాడు. అన్నీ సర్దుకొంటాయంటూ పాషా చెప్పాడు. సయూద్, లఖ్వీలతో పాటు ఇతర లష్కరే సభ్యులపై పాక్ నామమాత్రపు చర్యలే తీసుకుంటుందని పాషా అంతరార్థం. ► ముంబై దాడులు జరిగిన 8 నెలల తరువాత మీర్ నుంచి నాకో మెయిల్ వచ్చింది... ‘ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్’ చేయాలి అని. దీని అర్థం... భవిష్యత్ దాడులకు భారత్లో చోటు వెతకమని! ఈసారి ‘రాహుల్(భట్) సిటీ’లో దాడులు వద్దన్నా. రాహుల్ సిటీ అంటే ముంబై. ► ఇలియాస్ కశ్మీరీ(అల్ కాయిదా) కోరిక మేరకు 2009లో పుష్కర్, గోవా, పుణెల్లో రెక్కీ నిర్వహించా. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు పుణెలోని భారత సైనిక దక్షిణ దళ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించా. ► శివసేన మాజీ సభ్యుడు రాజారామ్ రెగేతో సంబంధాలు ఏర్పరచుకోవాలని మీర్, ఇక్బాల్ నాకు చెప్పారు. 2008 మే 19న ఓ ఇన్వెస్ట్మెంట్ గురించి రెగే మెయిల్ పంపాడు. రాణా ఇన్వెస్ట్మెంట్కు సంసిద్ధత వ్యక్తం చేశాడు. కానీ ఇక్బాల్ ఉగ్రదాడులకూ సిద్ధంగా లేడు. సైన్యం, పార్లమెంట్కు సంబంధించిన సమాచారం మాత్రమే కావాలన్నాడు. రెగే ఆ పని చేయగలుగుతాడా అని అడిగాడు. శివసేన చీఫ్ బాల్ ఠాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్లను అమెరికాకు పిలవాలని రెగేకు సూచించా. ముంబై దాడులతర్వాత అనేకసార్లు పాక్కు వెళ్లా. కానీ ఎఫ్ఐఏ నన్ను ఎన్నడూ విచారణకు పిలవలేదు. కాగా, కరాచీలోని కంట్రోల్ రూమ్ నుంచి లష్కరే సభ్యులకు, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణలను హెడ్లీ ముందుంచగా.. అబె కఫా, మీర్, అబు అల్ కమా గొంతులను గుర్తించగలిగాడు. -
అల్కాయిదా కూడా కుట్రపన్నింది
ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్పై దాడి చేయాలనుకుంది ♦ సిద్ధి వినాయక ఆలయం, నేవల్ ఎయిర్ స్టేషన్, విమానాశ్రయం కూడా ♦ ముంబై దాడుల లక్ష్యాల్లో ఉండాలని ఐఎస్ఐ, లష్కరే భావించాయి ♦ 26/11 దాడులపై మరిన్ని సంచలనాలు వెల్లడిస్తున్న డేవిడ్ హెడ్లీ ముంబై: 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించి ఇటీవలే అప్రూవర్గా మారిన ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ అమెరికా నుంచి వీడియో లింక్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఇస్తున్న వాంగ్మూలాల్లో నాలుగో రోజు శుక్రవారం మరిన్ని సంచలన అంశాలు వెల్లడయ్యాయి. భారత్పై ఉగ్రదాడి చేయాలని అల్కాయిదా కూడా ఆసక్తి చూపిందని హెడ్లీ వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ లక్ష్యంగా దాడులు చేయాలని భావించిందన్నారు. నిత్యం రద్దీగా ఉండే సిద్ధి వినాయక ఆలయం, నేవల్ ఎయిర్ స్టేషన్, విమానాశ్రయాలను ముంబై దాడుల్లో లక్ష్యంగా చేసుకోవాలని లష్కరే, ఐఎస్ఐ ఆలోచించాయని, అయితే, ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పి తాను వారిని అడ్డుకున్నానని చెప్పారు. భవిష్యత్లో శివసేన భవన్పై దాడి చేయాలని కాని, ఆ పార్టీ అధినేత( నాటి పార్టీ అధ్యక్షుడు బాల్ ఠాక్రేనుద్దేశించి)ను హతమార్చాలని కానీ లష్కరే ఆలోచించే అవకాశముందనే అభిప్రాయంతో శివసేన నేత రాజారామ్ రెగెతో సన్నిహితం కావడం కోసం తాను ప్రయత్నించానన్నారు. ‘ముంబై మారణ హోమం తరువాత 2009 ఫిబ్రవరిలో అల్కాయిదా కీలక నేత ఇల్యాస్ కశ్మీరీని కలిశాను. భారత్లో దాడులు చేయాలనుకుంటున్నామని, అందువల్ల మరోసారి ఇండియా వెళ్లాలని ఆయన నాకు సూచించారు. పలు ప్రాంతాలను.. ముఖ్యంగా ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్(ఎన్డీసీ)ని లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన నాకు చెప్పారు’ అని హెడ్లీ వెల్లడించారు. ఎన్డీసీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల.. బ్రిగేడియర్ నుంచి జెనరల్ హోదాల వరకు.. అక్కడ ఉండే అనేకమంది సైన్యాధికారులను హతమార్చే అవకాశం ఉన్నందువల్ల వారికి అది ముఖ్యమైన లక్ష్యంగా మారిందని హెడ్లీ తెలిపారు. ‘ఎన్డీసీపై దాడి విజయవంతమైతే.. గతంలో భారత్, పాక్ల మధ్య జరిగిన యుద్ధాల్లో చనిపోయిన భారత సైన్యాధికారుల సంఖ్యను మించిపోయేలా మారణహోమం సృష్టించవచ్చని అల్కాయిదా మరో సభ్యుడు అబ్దుల్ రెహ్మాన్ పాషా నాకు వివరించారన్నారు. హెడ్లీ వెల్లడించిన మరికొన్ని అంశాలు.. ► అల్కాయిదా నేత ఇల్యాస్ కశ్మీరీ ఆదేశాల మేరకు పుష్కర్, గోవా, పుణెల్లోని చాబాద్ హౌజ్ల వద్ద రెక్కీ నిర్వహించాను. ఎన్డీసీ తరువాత అవే అల్కాయిదా ముఖ్య లక్ష్యాలు. ► బార్క్(బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్)లోని కీలక, రహస్య సమాచారాన్ని అందించగల ఉద్యోగులను ఐఎస్ఐ కోసం రిక్రూట్ చేయాలని మేజర్ ఇక్బాల్ నన్ను ఆదేశించారు. 2008 జులైలో బార్క్లోనికి వెళ్లి, ఆ ప్రాంగణాన్ని వీడియో తీసాను. ► ముంబైని మొత్తం సర్వే చేసిన తరువాత లష్కరే చీఫ్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, సాజిద్ మిర్, అబు కాఫా, అబ్దుల్ రెహ్మాన్ పాషా, మేజర్ ఇక్బాల్లను పాకిస్తాన్లో పలుమార్లు కలిశాను. ► ముంబై దాడులకు ముందు ముంబైలోని చాబాద్ హౌజ్ వద్ద రెక్కీ చేశాను. అందులో ఇజ్రాయెల్ పౌరులు, యూదులు ఉంటారని, అది ముఖ్యమైన లక్ష్యమని సాజిద్ మిర్, అబ్దుల్ రెహ్మాన్ పాషా చెప్పారు. ► ముంబై దాడుల్లో పాల్గొనే ఉగ్రవాదులకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేశారు. లక్ష్యాల వద్దకు చేరుకుని, చివరివరకు మారణహోమం సృష్టించడం ఒక ప్రత్యామ్నాయం(స్ట్రాంగ్హోల్డ్ ఆప్షన్) కాగా.. దాడుల అనంతరం తప్పించుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్కు వెళ్లి, పోరాటం కొనసాగించడం(ఎగ్రెస్ ఆప్షన్) రెండో ప్రత్యామ్నాయం. అయితే మొదటిదాన్నే అమలు చేయాలని జకీ సాబ్(లష్కరే చీఫ్) ఆదేశించారు. ► దాడుల్లో పాల్గొంటున్న ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా ఆదేశాలిచ్చేందుకు కరాచీలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. డిగ్రీ పూర్తి చేసినందుకు కంగ్రాట్స్.. 26/11గురించి నా మొదటి భార్య షాజియాకు చెప్పాను. దాడుల అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఈమెయిల్ చేసింది. ‘గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు కంగ్రాట్స్. కార్యక్రమం చాలా బాగా జరిగింది’ అని ఆమె కోడ్ బాషలో మెయిల్ చేసింది. ‘థాంక్యూ జానూ.. ఈ మార్కులు సాధించేందుకు కష్టపడి చదివాను’ అని రిప్లై ఇచ్చాను. వాంగ్మూలంపై వాగ్యుద్ధం.. న్యూఢిల్లీ: గుజరాత్ పోలీసుల చేతిలో ఇషత్ ్రజహాన్ నకిలీ ఎన్కౌంటర్కు గురైందన్న వాదనకు వ్యతిరేకంగా.. ఆమె లష్కరే ఆత్మాహుతి దళ ఉగ్రవాది అంటూ హెడ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య విమర్శనాస్త్రాల తీవ్రత పెరిగింది. భవిష్యత్తులో ప్రత్యర్థి కాగలడని ముందే ఊహించిన కాంగ్రెస్.. మోదీపై మొదట్నుంచీ ఉన్న వ్యతిరేకతతో వాస్తవాలకు మసిపూసిందని బీజేపీ ఆరోపించింది. దానిపై, ఉగ్రవాదుల మాటలను నమ్మడం బీజేపీ ఎప్పడ్నుంచి ప్రారంభించిందంటూ కాంగ్రెస్ తిప్పి కొట్టింది. హెడ్లీ వాంగ్మూలంతో ముంబై దాడుల్లో పాక్ పాత్ర పూర్తిగా బట్టబయలైందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ వ్యాఖ్యానించారు.పాక్లోని ఉగ్ర సంస్థలు శివసేనను శత్రువుగా భావించడం తమ పార్టీకి గర్వకారణమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శివసేన భవన్లోకి అనుమతించాలన్న డేవిడ్ హెడ్లీ అభ్యర్థనను అప్పుడే తోసిపుచ్చానని శివసేన మాజీ సభ్యుడు రాజారాం రెగే తెలిపారు. -
నేడు ముంబై కోర్టులో హెడ్లీ సాక్ష్యం
ముంబై: ముంబై దాడుల కేసులో అప్రూవర్గా మారిన పాకిస్తానీ-అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ సోమవారం ముంబై కోర్టుకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం ఇవ్వనున్నాడు. దాడుల కుట్రపై మరిన్ని వివరాలు బయటికొచ్చే అవకాశముంది. భారత న్యాయ చరిత్రలో భారతీయ కోర్టు ముందు ఒక ‘విదేశీ ఉగ్రవాది’ సాక్ష్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు.