breaking news
Teju Ashwini
-
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నవాబ్ కేఫ్నటీనటులు: శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులునిర్మాణ సంస్థ: హర్షిక ప్రొడక్షన్స్దర్శకుడు : ప్రమోద్ హర్షనిర్మాత: రాధా వి పపుడిప్పుసంగీతం: ప్రశాంత్ ఆర్ విహారివిడుదల తేది: ఫిబ్రవరి 20, 2026టాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన మరో చిన్న సినిమా ‘నవాబ్ కేఫ్’. మొదటి ఈ సినిమాకు చాయ్ వాలా అని టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలపడంతో ‘నవాబ్ కేఫ్’గా మార్చారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ సినిమాకు పాజిటివ్ బజ్ని క్రియేట్ చేశాయి. పాతబస్తీ ఇరానీ చాయ్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన రంగనాథ్ (రాజీవ్ కనకాల) వారసత్వంగా వచ్చిన ‘నవాబ్ కేఫ్’ని రన్ చేస్తూ ఉంటాడు. అది కేవలం టీ కొట్టుగా కాకుండా కుటుంబ లెగసీగా ఫీలవుతాడు. తాత, తండ్రి లాగే రంగనాథ్ ‘టీ’కి కూడా అభిమానులు ఉంటారు. అయితే ఆయన కొడుకు రాజా(శివ కందుకూరి)కి మాత్రం ఆ కేఫ్లో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్లి భారీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటాడు. పెదనాన్న కొడుకు కుమార్(చైతన్య కృష్ణ) సలహాతో కేఫ్ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో తండ్రి, కొడుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. అదేరోజు రాత్రి రంగనాథ్ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజాలో వచ్చిన మార్పు ఏంటి? తన కలలను నెరవేర్చుకోవడం కోసం ‘నవాబ్ కేఫ్’ అమ్మేశాడా? లేదా తండ్రి విలువ తెలుసుకొని కేఫ్ని రన్ చేశాడా? ‘నవాబ్ కేఫ్’ కోసం కుమార్ చేసిన కుట్ర ఏంటి? రాజా తీసుకున్న నిర్ణయానికి ప్రియురాలు సఖీ( తేజు అశ్విని) ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరో మొదట్లో అల్లరి చిల్లరగా తిరగడం.. ఓ విషాద ఘటన తర్వాత పూర్తిగా మారిపోయి..తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం.. ఆ బిజినెస్ని దెబ్బతీసేందుకు విలన్ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టి.. చివరిలో ఆ రంగంలో రికార్డు సృష్టించడం..ఈ లైన్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘నవాబ్ కేఫ్’ కూడా ఇలాంటి కథే. కథ-కథనం రెండూ.. ఇటీవల ధనుష్ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమాను గుర్తు చేస్తాయి. అక్కడ ఇడ్లీ దుకాణం.. ఇక్కడ టీ కొట్టు.. అంతే తేడా. తండ్రి-కొడుకు ఎమోషన్ చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రమోద్ హర్ష ఎంచుకున్న పాయింటే రొటీన్ అంటే.. స్క్రీన్ప్లే కూడా అలానే ఉంది. కథనం ఎక్కడ ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్ సీన్ ఒక్కటి కాస్త ఎమోషనల్గా అనిపిస్తుంది. మిగతా కథంతా ఊహకందేలా.. నిదానంగా సా..గుతూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. నవాబ్ కేఫ్ హిస్టరీని తెలియజేస్తూ కథను ప్రారంభించారు దర్శకుడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. హీరోయిన్తో పరిచయం.. వారిద్దరి మధ్య సాగే లవ్ట్రాక్.. ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించదు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి.. సఖీ పాత్రను క్రియేట్ చేశారు కానీ..కథతో ఆమెకు ఎలాంటి సంబంధమే ఉండదు. హీరో అమెరికాకు వెళ్లాలని ఫిక్స్ అయినప్పుడే..తర్వాత కథనం ఎలా సాగుతుందనేది అర్థమైపోతుంది. ముందుగా చెప్పినట్లుగా ఇంటర్వెల్కి ముందు వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం కథనం మరింత సాగదీతగా సాగుతూ.. ఇడ్లీ కొట్టు, కీర్తి సురేశ్ మిస్ ఇండియా తో పాటు పలు సినిమాలను గుర్తుకు చేస్తుంది. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. రాజా పాత్రకు శివ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. హీరో తండ్రిగా రాజీవ్ కనకాల రొటీన్ పాత్రే చేసినా.. ఎమోషనల్ సీన్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ తెజు అశ్విని పాత్రకు కథలో ప్రాధాన్యత లేదు. తెరపై కనిపించేది కూడా తక్కువే. రాజ్కుమార్ కసిరెడ్డి తనదైన కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా కూడా సినిమా యావరేజ్గానే ఉంది. సినిమా మొత్తం ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందంటే..అది ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అని చెప్పాలి. ఆయన అందించిన పాటలతో పాటు బీజీఎం కూడా సినిమా స్థాయిని పెంచేలా చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమా మొత్తంలో చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సీన్లను కట్ చేసినా.. కథకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'నవాబ్ కేఫ్' హీరోయిన్ తేజు అశ్విని (ఫొటోలు)
-
క్యూట్ అందాలతో కుర్రకారు మనసు దోచేస్తున్న తేజు అశ్విని (ఫోటోలు)
-
జీవీ ప్రకాశ్తో తేజు అశ్విని రొమాన్స్
తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడిగా జోడి గుర్రాలను స్వారీ చేస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్ ఆ మధ్య కథానాయకుడిగా నటించిన బ్యాచిలర్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. దీనికి ఎం.మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు అరుళ్ నిధి హీరోగా ఇరవుక్కు అయిదు కన్గళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా కన్నై నంబాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెరపై రావడానికి ముస్తాబవుతోంది. దీంతో దర్శకుడు ఎం.మదన్ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడు. దీనికి బ్లాక్ మెయిల్ అనే టైటిల్ను నిర్ణయించారు. జయక్కొడి పిక్చర్స్ పతాకంపై అమల్రాజ్ నిర్మిస్తున్నారు. ఇందులో జీవీ ప్రకాష్కుమార్కు జంటగా నటి ప్రజ్ఞ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటి తేజు అశ్విని ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా వెల్లడించారు. ఆదిలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించిన ఈ చెన్నై చిన్నది 2020లో ఎన్నై సొల్లపోగిరాయ్ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సంతానం సరసన ప్యారీస్ జయరాజ్ చిత్రంలో నటించింది. తాజాగా జీవీ ప్రకాశ్కుమార్కు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. బ్లాక్ మెయిల్ చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు.


