breaking news
sv subba reddy
-
శోభానాగిరెడ్డి మృతి.. ప్రముఖుల సంతాపాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారన్న సమాచారం రాష్ట్రంలోని ప్రముఖులు, రాజకీయ నేతలను విస్మయపరిచింది. మరణవార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు గురువారం హైదరాబాద్ వచ్చి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపాలను ప్రకటించారు. నరసింహన్, రోశయ్య, ప్రముఖుల సంతాపం శోభా నాగిరెడ్డి మృతి దురదృష్టకరమని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన సేవాతత్వంతో ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆమె లేని లోటు ఆ కుటుంబానికి తీరనిదని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శోభ మరణం కుటుంబ సభ్యులకే కాకుండా కర్నూలు జిల్లా ప్రజలకు పూడ్చలేని లోటని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన సంతాపాన్ని ప్రకటించారు. శోభానాగిరెడ్డి దుర్మరణం పట్ల కేంద్రమంత్రి చిరంజీవి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ నేతలు కిషన్రెడ్డి, హరిబాబు, వెంకయ్యనాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, లోక్సత్తా అధినేత జేపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, టీడీపీ ఎంపీలు దేవేందర్గౌడ్, సుజనా చౌదరి, ఎమ్మెల్యే వంగా గీత తమ సంతాపాన్ని ప్రకటించారు. శోభానాగిరెడ్డి మరణం తమ పార్టీకి, తమకు తీరని లోటని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, కొండేపి అభ్యర్థి జూపూడి ప్రభాకర్, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సినీహీరో రాజా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాటలకందని విషాదం: తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి ‘‘శోభ మరణం ఊహకందని, మాటలకందని మహా విషాదం. చిన్నప్పటినుంచి చాలా ఉత్సాహంగా ఉండేది. నాతో ఎక్కువ చనువుగా ఉండేది. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాతోపాటు కార్యాలయానికి వచ్చేది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాతో కలసి తిరిగేది. అందుకే ఆమెకు రాజకీయాలంటే మంచి ఆసక్తి. తండ్రి, కూతురు ఒకే శాసనసభలో కూర్చోవడం చాలా అరుదైన విషయం. అప్పట్లో మహబూబ్నగర్ నుంచి సి.నర్సిరెడ్డి, ఆయన తనయ డీకే అరుణ మాత్రమే మాలాగా ఎమ్మెల్యేలుగా ఉండేవారు. శోభ ప్రతి విషయం నాతో చర్చించేది. అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడవచ్చా.. లేదా? అని అడిగి తెలుసుకునేది. చిన్నవయస్సులోనే రాజకీయాల్లో అందరి మెప్పు పొం దింది. బుధవారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్లో ఉండే నా స్నేహితుడు టీవీల్లో శోభానాగిరెడ్డికి ప్రమాదం జరిగిందని స్క్రోలింగ్ వస్తోందని ఫోన్ చేసి చెప్పేవరకు నాకు తెలియదు. వెంటనే నా కుమారుడు మోహన్రెడ్డికి ఫోన్ చేశాను. నా కోడలుతో పాటు నంద్యాలకు వెళ్తున్నామని మోహన్ చెప్పాడు. నేను బయలుదేరుతానన్నాను. నీ ఆరోగ్యం బాగాలేదు వద్దని వారించారు. నేను యువకుడిగా ఉన్నప్పుడు రాజకీయాలంటే అసలు ఆసక్తే ఉండేది కాదు. అలాంటిది కాలేజీ సెలవుల్లో ఊరికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చేశాను. శోభ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటుందని అనుకున్నాను. అయితే మనం అనుకున్నవన్నీ జరగవు కదా. భూమా నాగిరెడ్డిని పెంచింది కూడా నా భార్యే. ఆళ్లగడ్డలో మా కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. రాజకీయంగా ఓ పేరుంది. ఆ స్ఫూర్తిని అందుకునే శోభ రాజకీయంగా ఎదిగింది’’ అని ‘సాక్షి’తో తనయ జ్ఞాపకాలను నెమరేసుకుని ఎస్వీ సుబ్బారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. -
చిరునవ్వు ఆమెకో వరం
శోభా నాగిరెడ్డి నా కోడలు. శోభా నాగి రెడ్డితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. శోభ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను 1983లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమ యంలో శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్. ఆయనే ‘మీ అత్త’ అంటూ నన్ను శోభకు పరి చయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను ఎక్కడ కనిపించినా అత్తయ్యా బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించేది. నా భర్త గురించి అడిగేది. సుబ్బారెడ్డి 1989లో కాం గ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అపుడు నేను కూడా ఎమ్మెల్యేనే. శోభ భర్త భూమా నాగిరెడ్డి, బావ వీర శేఖరరెడ్డి కూడా నాతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో శోభతో సాన్నిహిత్యం మరింత పెరి గింది. ఆ తరువాత నేను టీడీపీలో చేరాను. అప్పటి నుంచి మరింత సన్నిహితంగా మెలిగే వాళ్లం. శోభ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. నేను తెలు గుమహిళ అధ్యక్షురాలిగా పనిచేశాను. ఈ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్ర మాలు, ప్రభుత్వ పరంగా మహిళల సంక్షే మం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చుకునే వాళ్లం. శోభా నాగిరెడ్డి అక్క కుమార్తె, ప్రస్తుతం గుంటూరు జిల్లా వినుకొండ అసెం బ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా కుమార్తె నన్నపనేని సుధ బెంగళూరు వైద్య కళాశాలలో సహధ్యాయులు. ఈ విధంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. నేను నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్కు శోభ హాజర య్యేది. రాజకీయాల్లోకి మహి ళలు రావటం తక్కువ. వచ్చినా రాణించిన వారు ఇంకా తక్కువ. ఇక రాయలసీమలో మహిళలు రాజకీయాల్లో రాణించటమంటే కత్తిమీద సామే. అలాంటిది శోభ బాగా రాణించింది. ఆమెది కష్టపడే తత్వం. మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. ఎపుడూ నవ్వుతూ, సంప్రదాయబద్ధంగా కనపడేది. చిరునవ్వే శోభకు వరం. స్నేహానికి ప్రాణమిచ్చేది. శోభ మరణం బాధాకరం. (వ్యాసకర్త ఎమ్మెల్సీ) -
చిన్నమ్మాయి లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి
శోభా నాగిరెడ్డి మరణవార్త విని ఆమె తండ్రి, సీనియర్ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి తీవ్రంగా కలత చెందారు. అసలు ఆమె లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డలో ఆయన 'సాక్షి'తో ఇలా మాట్లాడారు... ''ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరికంటే చిన్నమ్మాయి. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చి అందరిమెప్పు సాధించింది. ఆమె ఎన్నో విజయాలు సాధించింది. తక్కువ కాలంలోనే, చిన్న వయసులోనే ఇంత విజయాలు సాధించినవాళ్లను ఎవరినీ చూడలేదు. మా అందరికీ, మా కుటుం సభ్యులందరికీ చాలా బాధగా ఉంది. కన్న కూతురిగా చూసినా.. అందరి మన్ననలు పొందుతుంటే ఎంతో ఆనందించేవాళ్లం. ఇప్పుడు ఆమె లేదన్న విషయం మాటల్లో చెప్పలేని బాధ కలిగిస్తోంది. శోభా నాగిరెడ్డికి ప్రమాదం జరిగినట్లు ఒక స్నేహితుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు టీవీ ఆన్ చేసి చూస్తే విషయం తెలిసింది. టీవీల్లో స్క్రోలింగ్ చూడగానే మా అబ్బాయి మోహన్రెడ్డికి ఫోన్ చేశాను. అప్పటికే మా అబ్బాయి, కోడలు నంద్యాలకు బయల్దేరారు. నేను కూడా బయల్దేరుతానని చెప్పినా, నేను హృద్రోగిని కావడంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వద్దన్నారు. తాము చూసుకుంటామన్నారు'' అని ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు.