breaking news
Sushil Sharma
-
సెకను కోపం..ఊచలు లెక్కపెట్టిస్తోంది..!
ఢిల్లీలోని అశోకా రోడ్లో కానిస్టేబుల్ అబ్దుల్ నజీర్ కుంజు, హోంగార్డ్ చందర్పాల్లు గస్తీ కాస్తున్నారు. పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. అంతా సవ్యంగానే ఉందనుకొన్నారు. కానీ, ఏదో మూల.. ఎక్కడో చిన్న అనుమానం. దూరంగా ఓ స్టార్ హోటెల్ నుంచి వెలువడుతున్న నల్లని పొగ అబ్దుల్ నజీర్కు ఎక్కడలేని సందేహాలనీ కలిగిస్తోంది. చందర్పాల్ తోడుగా దగ్గరకు వెళ్లి చూశాడు. ఏదో పెద్ద అగ్ని ప్రమాదమే జరిగేలా ఉందనుకుని, హోటెల్ గేటు దూకి లోపలికి ప్రవేశించాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం పాటు షాక్కు గురయ్యాడు. ఇంతకీ అక్కడేం జరిగింది..? 1995, జూలై 2.. తన పనులు ముగించుకుని ఢిల్లీలోని మందిర్ మార్గ్ దిశగా దూసుకెళ్తున్నాడు సుశీల్ శర్మ. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బిజీగా ఉండే ఆయన.. ఇంటికి చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయింది. సుశీల్ రాకను 29 ఏళ్ల అతడి భార్య, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నైనా సాహ్ని గుర్తించలేదు. టెలీఫోన్లో ఎవరితోనో మాటల్లో మునిగిపోయింది. నేరుగా ఆమె గదికి చేరుకున్నాడు సుశీల్. అతడిని చూసీ చూడటంతోనే ఫోన్ కట్ చేసింది నైనా. అంతే.. సుశీల్లో అనుమానం, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. 'ఇంత రాత్రి పూట ఎవరితో మాట్లాడుతున్నావ్' అంటూ కళ్లెర్రజేశాడు. విసురుగా ఫోన్ లాక్కొని, నైనా చివరిసారిగా మాట్లాడిన నంబర్ను రీడయల్ చేశాడు. రెండు రింగులు పూర్తయ్యాక, అవతలి వైపు నుంచి బాగా తెలిసిన స్వరమే వినిపించింది. ఆ గొంతు మత్లూబ్ కరీమ్ది. అతడు నైనా సాహ్నికి క్లాస్మేట్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త కూడా! దీంతో తన అనుమానం నిజమేనని నిర్ధారించుకున్నాడు సుశీల్. ఒక్కసారిగా పొంగుకొచ్చిన దుఃఖాన్నీ, కోపాన్నీ నియంత్రించుకోలేకపోయాడు. కనీసం, ఏం మాట్లాడారని భార్యని ప్రశ్నించకుండానే.. తన వెంటే తెచ్చుకున్న లెసైన్స్డ్ రివాల్వర్ని ఆమె వైపు ఎక్కుపెట్టాడు. రెప్పపాటు వేగంలో.. ఏం జరుగుతోందో ఆమెకు తెలిసేలోపే ట్రిగ్గర్ను మూడుసార్లు నొక్కాడు. అంతే.. ఓ బుల్లెట్ తలలోకి, మరొకటి మెడ భాగంలోకి దూసుకుపోయాయి. మూడో బుల్లెట్ గురి తప్పి గదిలోని ఏసీని తాకింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే గది మొత్తం నైనా రక్తంతో నిండిపోయింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తానెంత పెద్ద తప్పు చేశాడో కొద్ది సేపటికే అర్థం చేసుకున్న సుశీల్.. తప్పును ఒప్పు చేయాలనుకుని, మరింత పెద్ద తప్పిదం చేశాడు. నైనా మృతదేహాన్ని ఓ గుడ్డలో చుట్టి, అశోకా రోడ్డులోని బాగియా బార్బేక్యూ రెస్టారెంట్కు చేరుకున్నాడు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న రెస్టారెంట్ మేనేజర్ కేశవ్ కుమార్, సుశీల్కు సాయపడ్డాడు. ఇద్దరూ కలిసి నైనా శవాన్ని ‘తందూర్’ అనే మట్టి పొయ్యిలాంటి నిర్మాణం దగ్గరకు తీసుకెళ్లారు. రెస్టారెంట్లోని ఆయుధాలతో అత్యంత కిరాతకంగా ఆమె దేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికారు. వాటన్నిటినీ తందూర్లో వేసి, కట్టెలతో మంట వెలిగించారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో మృతదేహం దహనమవ్వసాగింది. ఈ తంతు మరింత వేగంగా ముగించడానికి కేశవ్.. నిర్విరామంగా కట్టెలను పొయ్యిలోకి కూరుతూనే ఉన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి చేరుకున్నారు ఢిల్లీ కానిస్టేబుల్ అబ్దుల్, హోం గార్డు చందర్పాల్లు. ఓవైపు రెస్టారెంట్ పైకప్పుని తాకుతున్న మంటలు.. మరోవైపు శవం దహనమవుతోన్న వాసన రావడంతో వారిలో అనుమానం బలపడింది. కేశవ్ని పట్టుకుని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ కార్యకర్తననీ, పాత బ్యానర్లు, జెండాలు తగులబెడుతున్నాననీ చెప్పాడు కేశవ్. అయితే, కానిస్టేబుల్ అతడి మాటలు నమ్మలేదు. తందూర్పై నీటిని కుమ్మరించి, మంటలు ఆరిపోయేలా చేశాడు. ఈ గందరగోళంలో అక్కడి నుంచి సుశీల్ తెలివిగా తప్పించుకున్నాడు. ఆ రాత్రి గుజరాత్ భవన్లో తలదాచుకుని, జైపూర్కు పారిపోయాడు. అక్కడి నుంచి ముంబైకి, తర్వాత చెన్నైకీ మకాం మార్చాడు. చివరగా జూలై 10న బెంగళూరు చేరుకుని అక్కడే పోలీసులకి లొంగిపోయాడు. అత్యంత కిరాతకంగా భార్యను హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా చేయాలని చూసిన సుశీల్ను చూసి, తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. దేశ రాజధాని సహా దేశమంతటా ఈ హత్యకేసు సంచలనంగా మారింది. ఏళ్లపాటు కొనసాగిన విచారణలో తొలుత సుశీల్, కేశవ్లు నేరం అంగీకరించలేదు. తర్వాత తప్పు చేశామని ఒప్పుకొన్నారు. వీరికి న్యాయస్థానం 2003, నవంబర్ 7న శిక్ష విధించింది. సుశీల్కు మరణ దండన వేయగా, కేశవ్కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గతేడాది ఈ కేసును పునఃపరిశీలించిన సుప్రీం కోర్టు.. 20 ఏళ్లకు పైగా జైళ్లోనే మగ్గిన సుశీల్కు ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. అతడి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత సెప్టెంబర్లో పెరోల్పై బయటకు వచ్చిన సుశీల్.., ‘‘ఒక్క సెకను.. నా జీవితాన్నే సర్వనాశనం చేసింది’’ అంటూ వాపోయాడు. చక్కని రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడి జీవితం అలా క్షణికావేశంతో నాశనమైపోయింది. -
తందూర్ కేసులో సుశీల్ శర్మకు శిక్ష తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూర్ కేసులో మాజీ యూత్ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ శర్మకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. భార్య నైనా సాహ్నీని చంపి, ముక్కలుగా కోసి తందూర్ పొయ్యిలో దారుణంగా కాల్చేసిన ఆయనకు 2003లో దిగువకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షగా మారుస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. సుశీల్ శర్మకు గతంలో నేరచరిత్ర లేకపోవడం వల్ల అతడు సమాజానికి ముప్పుకాకపోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. అతడు భార్యను అమితంగా ప్రేమించాడని, అయితే ఆమెపై అనుమానంతో క్షణికావేశంలో హత్య చేసినట్లు కనబడుతోందని పేర్కొంది. దీనికి అతడు పశ్చాత్తాపం చెందినట్లు కనిపిస్తోందని, ఇది అత్యంత అరుదైన నేరం కాదని, అందువల్ల అతనికి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తున్నట్లు స్పష్టం చేసింది. -
'ఉరి' తప్పింది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూరీ హత్యకేసులో నిందితుడు, ఢిల్లీ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ శర్మకు 'ఉరి' తప్పింది. అతనికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. 1995 జులై 2న తందూరీ రెస్టారెంట్లో తన భార్య నైనా సాహ్నిని తోసివేసి నిప్పు అంటించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే నైనా సాహ్నిపై ఏర్పడ్డ అనుమానం వల్లే ఈ హత్య జరిగిందని భావించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ... సుశీల్ శర్మ మరణ శిక్షను జీవితఖైదుగా మార్పు చేస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసుల ఛార్జీషీటు ప్రకారం.. కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్న తన భార్య నైనా సాహ్ని మరో కాంగ్రెస్ నేత మత్లూబ్ కరీంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకున్నాడు. అంతేకాకుండా మత్లూబ్ కరీం.. నైనా ఇద్దరూ కలిసి చదువుకున్న నేపథ్యంలో ....వారు రహస్యంగా వివాహం చేసుకుంటారని భావించిన శర్మ నైనాపై ద్వేషం పెంచుకున్నాడు. జులై 2న ఇంటికి వచ్చిన శర్మ తన భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా చూశాడు. ఆ తర్వాత ఫోన్ రీడయల్ చేసిన శర్మకు ఆ నెంబరు మత్లూబ్ కరీందిగా తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన శర్మ తన భార్య నైనా సాహ్నిపై తన దగ్గర ఉన్న సైలెంట్ రివాల్వర్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో నైనా అక్కడికక్కడే మృతి చెందింది. నైనా మృతదేహాన్ని శర్మ, తన స్నేహితుడు, భాగియా రెస్టారెంట్ మేనేజర్ కేశవ్తో కలిసి తందూరి పొయ్యిలో పెట్టి కాల్చివేశారు. అనంతరం హత్యను ప్రమాదవశాత్తూ జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్న సుశీల్ శర్మ జులై 11, 1995లో పోలీసులకు లొంగిపోయాడు. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టు కూడా మరణశిక్షను ధ్రువీకరించి క్షమాభిక్షను నిరాకరించింది. దాంతో సుశీల్ శర్మ తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని అతను సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే. -
తందూరీ కేసులో సుశీల్ శర్మకు జీవిత ఖైదు
నైనా సాహ్ని హత్య కేసులో సుశీల్ శర్మకు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారస్తూ సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన భార్య నైనా సాహ్ని హత్య కేసులో తనకు మరణశిక్ష విధించడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ కేసు ఈ ఏడాది ఆగస్టు13న సుప్రీం విచారించింది. అనంతరం ఆ కేసును ఆక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన నేత సుశీల్ శర్మ. ఆయన భార్య నైనా సాహ్ని. 1995లో నైనా సాహ్నిని హత్య చేశాడు. అనంతరం ఆమెను తన నివాసంలో తందూరీ చికెన్ తరహాలో కాల్చాడు. దాంతో సుశీల్ శర్మపై కేసు నమోదు అయింది. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దాంతో ఆయన తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని ఆయన సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే.