-
తెలంగాణేతరుల దరఖాస్తుల్ని అనుమతించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణేతర అభ్యర్థుల దరఖాస్తులనూ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, సహాయ ఇంజ నీర్స్ (ఏఈ) పోస్టులకు స్వీకరించాలని రాష్ట్ర ట్రాన్స్కోలు, టీఎస్ఎస్పీడీసీఎల్లను హైకోర్టు ఆదేశించింది. పోస్టుల భరీకి నిర్వహించే పరీక్షలకూ అనుమతించాలని విద్యుత్ సంస్థలకు తెలి పింది. స్థానికతను ఆధారంగా చేసుకు ని ట్రాన్స్కో, పీడీసీఎల్లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. స్థానికతను నిర్ణయించే అధికారం విద్యుత్ సంస్థలకు ఉండదని, పార్లమెంటు చట్టం ద్వారానే స్థానికత నిర్ణయానికి ఆమోదం ఉంటుందని పేర్కొంటూ నిఖిల్కుమార్, పావని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశా రు. విద్యుత్ సంస్థల నిర్ణయం రాజ్యాం గ వ్యతిరేకమని వారి తరఫు న్యాయ వాది వాదించిన అనంతరం ధర్మాసనం.. వ్యాజ్యాలను విచారణకు స్వీకరించి పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ సంస్థలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఉత్పత్తి ఊహించనంత
డిమాండ్ కన్నా లభ్యత డబుల్ - 2022 నాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి.. - లభ్యత 20,359 మెగావాట్లు.. డిమాండ్ 11,967 మెగావాట్లే.. - థర్మల్ విద్యుత్ పూర్తిగా బ్యాకింగ్ డౌన్ - పునరుత్పాదక విద్యుత్ సరఫరా.. రాష్ట్ర విద్యుత్ రంగంపై నీతి ఆయోగ్ సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే డిమాండ్ చాలా తక్కువగా ఉండనుంది. 2021–22 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 11,967 మెగావాట్లకు చేరుతుంది. అయితే విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం మాత్రం దానికి రెట్టింపుగా 20,359 మెగావాట్లకు చేరుకోనుంది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తిని బ్యాకింగ్ డౌన్ చేసి పునరుత్పాదక విద్యుత్తో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చాల్సిన విచిత్ర పరిస్థితి ఉత్పన్నం కానుంది’అని నీతిఆయోగ్ పేర్కొంది. 2022 నాటికి రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 20,359 మెగావాట్లకు పెరగనుండగా, అందులో థర్మల్ విద్యుత్ 10,797 మెగావాట్లు, జల విద్యుత్ 2,916 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,457 మెగావాట్లు, పవన విద్యుత్ 2,000 మెగావాట్లు, ఇతర విద్యుత్ 189 మెగావాట్ల వాటాలుంటాయని తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 9 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని పేర్కొంది. రాష్ట్ర విద్యుత్ రంగంపై తాజాగా రూపొందించిన రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక–2022లో నీతి ఆయోగ్ ఈ కీలక విషయాలను పొందుపరిచింది. 2 లక్షల మిలియన్ యూనిట్ల డిమాండ్ దిశగా.. మరో 15 ఏళ్ల తర్వాత రాష్ట్ర వార్షిక విద్యుత్ అవసరాలు 1,99,731 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు పెరగనున్నాయి. రోజువారీ విద్యుత్ డిమాండ్ కూడా సగటున 28,752 మెగావాట్లకు పెరగనుంది. పునరుత్పాదక విద్యుత్కు భవిష్యత్తు.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా 2029–30 సంవత్సరంలో 27.32 శాతానికి పెరగనుంది. పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 14,748 మెగావాట్లకు పెరగనుండగా, సౌర విద్యుత్ ప్లాంట్లు 12,558 మెగావాట్లు, సౌరేతర విద్యుత్ ప్లాంట్లు 2,190 మెగావాట్లు ఉండనున్నాయి. మొత్తం 24,636 ఎంయూల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కానుండగా, అందులో 20,902 ఎంయూల సౌర విద్యుత్, 4,029 ఎంయూల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉండనుంది. నీతి ఆయోగ్ నివేదికలోని ఇతర ప్రధానాంశాలు.. ► మరో రెండేళ్లలో 2,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. అందులో అధిక భాగం సౌర విద్యుత్ ప్లాంట్లే.. ► ఈ ఏడాది 300 మెగావాట్ల పవన విద్యు త్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. ► సంప్రదాయ వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సౌర విద్యుత్ పంపు సెట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు 70 వేల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసింది. ► రానున్న సంవత్సరాల్లో ఎన్టీపీసీ దశల వారీగా రాష్ట్రంలో 1,600 మెగావాట్లు, 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది. ► 2018 ముగిసేలోగా రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యం 25,000 మెగావాట్లకు పెరగనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement