-
18న సడక్ బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సంఘాలు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని నిర్వహించాయి. శనివారం చలో ట్యాంక్బండ్ కార్యక్రమంలో పోలీసు నిర్బంధాన్ని ఛేదించి వందల సంఖ్యలో కారి్మకులు గమ్యం చేరటంతో వచి్చన ఊపుతో ఉత్సాహంగా ఉన్న సమ్మె కార్యాచరణకు మరింత పదునుపెట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘సడక్ బంద్’నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది దాదాపు రాష్ట్ర బంద్ తరహాలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర రహదారులన్నింటిని దిగ్బంధం చేయటం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 37 రోజులు గా సమ్మె చేస్తున్నా, స్వయంగా హైకోర్టు కొన్ని సూచనలు చేసినా ప్రభుత్వం దిగిరాకపోవటాన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి, కో కనీ్వనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక నిరశన ప్రారంభించాలని నిర్ణయించింది. ఆదివారం అఖిలపక్ష నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన జేఏసీ నేతలు అనంతరం కార్యాచరణను ప్రకటించారు. జేఏసీ కోకనీ్వనర్లు రాజిరెడ్డి, సుధ తదితరులతో కలసి కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. నేడు మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా కోరా లని జేఏసీ నిర్ణయించింది. సోమవారం వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేసి వారిని కలసి వివ రించాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని ఇళ్లు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఇళ్లను ముట్టడించనున్నట్టు జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ కన్వీనర్, కో కనీ్వనర్లు ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరశనలు ప్రారంభించనున్నారు. ఇందిరాపార్కు వద్ద అనుమతి లభించని పక్షంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో చేపట్టనున్నట్టు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. ఆర్టీసీ కారి్మకులపై ప్రభుత్వ తీరు, చలో ట్యాంక్బండ్లో పోలీసుల ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చలో ట్యాంక్బండ్లో మహిళా కండక్టర్ల పట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, చాలామంది గాయపడ్డారని, దీనిపై అవసరమైతే జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమ్మె మొదలైనప్పటి నుంచి చలో ట్యాంక్బండ్ వరకు చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలకు సంబంధించిన ఫొటోలను, ఇప్పటివరకు చనిపోయిన కారి్మకులకు సంబంధించిన ఫొటో వివరాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించాలని అనుకున్నామని, కార్యక్రమం ఖరారయ్యాక కచి్చతమైన తేదీలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వీలైతే ఓరోజు హైదరాబాద్లో కూడా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. సడక్బంద్లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఆ పార్టీ నేత సంపత్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేత నరసింహారావు, బీజేపీ నేతలు జితేందర్రెడ్డి, మోహన్రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్, సీపీఐ నేత సుధాకర్, ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనుమతివ్వకపోగా దమనకాండనా..? ‘సమ్మెను ఇప్పటివరకు శాంతియుతంగానే నిర్వహించాం. అదే పంథాలో ట్యాంక్బండ్పై గంట సేపు నిరసన వ్యక్తం చేస్తామని కోరినా అనుమతి ఇవ్వలేదు. చలో ట్యాంక్బండ్కు వచ్చిన కారి్మకులు, మహిళలపై పోలీసులు దమనకాండకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు యతి్నస్తున్నారు. చలో ట్యాంక్బండ్లో మావోయిస్టులు చొరబడ్డారన్న ఆరోపణ ను ఖండిస్తున్నాం. రాజ్యమన్నా, రాజ్యాంగమన్నా గౌరవమున్నవారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు’అని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు తోడుగా విపక్షాల కార్యకర్తలు.. ఇక నుంచి ఆర్టీసీ జేఏసీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. సమ్మె కార్యాచరణకు మద్దతు, సంఘీభావం తెలపటానికే పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని ఆయా పారీ్టలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ–అఖిలపక్ష నేతల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అప్పుడు ప్రజల మద్దతు పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. దీనికి అన్ని పారీ్టలు సమ్మతించినట్లు సమాచారం. సోమవారం హైకోర్టులో మళ్లీ వాదనలు ఉన్నందున మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఆర్టీసీ సమ్మె అంశాన్ని జాతీయ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఆదివారం నిర్ణయించింది. సోమ లేదా మంగళవారాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్ను కలసి ఆర్టీసీ కారి్మకులకు న్యాయం చేయాలని కోరనుంది. ఇందుకోసం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది. -
కాపు ఉద్యమానికి మద్దతుగా నిరసనలు
కవాడిగూడ: కాపుల రిజర్వేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్లో కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా శనివారం జరగనున్న ఏపీ బంద్కు ఆలిండియా కాపు జేఏసీ తెలంగాణ కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కాపులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కాపు నేత ముద్రగడ చేస్తున్న దీక్షలను భగ్నం చేసిన ఏపీ ప్రభుత్వం అమానుషంగా అరెస్టు చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. లోయర్ ట్యాంక్బండ్ అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం కార్యాలయంలో పలు కాపు సంఘాలు శుక్రవారం రాత్రి ప్రత్యేక సమావేశం అయ్యాయి. కార్యక్రమంలో ఆలిండియా కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్, కన్వీనర్ కటారి అప్పారావు, అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం అధ్యక్షులు ఎంహెచ్ రావు, ప్రధాన కార్యదర్శి అద్దెపల్లి శ్రీధర్ పాల్గొన్నారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా ఇందిరాపార్కు ధర్నా చౌక్లో శనివారం నుంచి రిలే నిరాహర దీక్షలు చేయాలని భావించావుని, దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారని జనార్దన్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు బయటవ్యక్తులు రావద్దంటూ ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో కాపు జాగృతి నాయకులు గాళ్ల సతీష్ రిట్ వేసినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నగరంలో నిర్వహిస్తామన్నారు. శనివారం ఉదయం ట్యాంక్బండ్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement