breaking news
Sovereign bonds
-
కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సార్వత్రిక గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు సంబంధించి తుది రిడంప్షన్ ధరను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగబోతుంది. 2016-17 సిరీస్ 4(ఎనిమిదేళ్లు), 2019-20 సిరీస్ 4(ఐదేళ్లు)లో పెట్టుబడిదారులు ఈమేరకు గణనీయమైన రాబడిని పొందనున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎస్జీబీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు మూడు రెట్లు పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.2017 ఫిబ్రవరిలో గ్రాముకు రూ.2,943 చొప్పున జారీ చేసిన 2016-17 సిరీస్ 4 బాండ్లను ఇప్పుడు గ్రాముకు రూ.8,624గా రీడీమ్ చేసి 193 శాతం రాబడిని అందించనున్నారు. అదే ధరకు 2019 సెప్టెంబర్లో జారీ చేసిన 2019-20 సిరీస్ 4లో ఇన్వెస్టర్లు గ్రాముకు రూ.8,634 చొప్పున బాండ్లను రీడీమ్ చేసుకోవచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 10 నుంచి మార్చి 13 మధ్య 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా ఈ రెండు సిరీస్లకు రిడంప్షన్ను మార్చి 17న షెడ్యూల్ చేశారు.రిడంప్షన్ ధర ఎలా లెక్కిస్తారంటే..బాండ్లను రిడంప్షన్ చేసుకునేవారికి ఆ తేదీకి ముందు గడిచిన మూడు పనిదినాల్లో సగటు బంగారం ధర (999 స్వచ్ఛత) ఆధారంగా ఉంటుంది రాబడిని లెక్కిస్తారు. ఈ బాండ్ సిరీస్ కోసం ఐబీజేఏ 2025 మార్చి 11, 12, 13 తేదీల్లో బంగారం ధరలను లెక్కించింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) ఎనిమిదేళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. కానీ పెట్టుబడిదారులు ఐదేళ్ల తర్వాత వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఈమేరకు సంబంధిత వడ్డీ చెల్లింపు తేదీల్లో మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఎస్జీబీ సిరీస్ 4 2019-20కు సంబంధించి ఐదేళ్లకాలానికి రిడీమ్ తేదీని మార్చి 17గా నిర్ణయించారు.రిడీమ్ ప్రక్రియ ఇలా..బాండ్లను ముందుగానే రిడీమ్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు వడ్డీ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు నిర్దేశించిన బ్యాంకు, ఎస్హెచ్సీఐఎల్ కార్యాలయం, పోస్టాఫీసు లేదా ఏజెంట్ వద్ద దరఖాస్తు సమర్పించాలి. ఈ అభ్యర్థన మార్చి 17 కంటే కనీసం ఒక రోజు ముందుగా విజయవంతంగా ప్రాసెస్ అవుతుంది. ఇది ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఆదాయం నేరుగా ఎస్జీబీ అప్లికేషన్తో లింక్ చేయబడిన ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మెచ్యూరిటీ కంటే ముందు కూడా అత్యవసర సమయాల్లో పెట్టుబడులను ఉంపసంహరించుకోవచ్చు. కానీ దానిపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రాబడి తగ్గుతుంది.మెచ్యూరిటీ వరకు ఎస్జీబీలను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలుపన్ను రహిత లాభాలు: మెచ్యూరిటీ వరకు ఉంచితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.గ్యారంటీడ్ వడ్డీ: 2.5 శాతం వార్షిక వడ్డీ స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది.మార్కెట్ లింక్డ్ రిటర్న్స్: ప్రస్తుతం ఉన్న బంగారం ధరలతో ముడిపడి రాబడి పెరుగుతుంది.భద్రత: ప్రభుత్వ మద్దతు ఉండే ఎస్జీబీలు పెట్టుబడులకు భద్రత కల్పిస్తాయి.ఏమిటీ ఎస్జీబీలు..?ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?భారంగా మారిన బాండ్లుభారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్ బాండ్స్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం. -
రూ.16,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా.. జనవరి 25న తొలి విడత గ్రీన్ బాండ్ల జారీ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జనవరి 25, ఫిబ్రవరి 9వ తేదీల్లో.. రెండు విడతలుగా సావరిన్ గ్రీన్ బాండ్లు (ఎస్జీఆర్ బాండ్స్) జారీ చేయనుంది.రెండు విడతల ద్వారా రూ.8,000 కోట్ల చొప్పున మొత్తం రూ.16,000 కోట్ల సమీకరణ లక్ష్యం. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులకు ఈ నిధులను సమకూర్చడం జరుగుతుంది. వార్షిక బడ్జెట్ (2022–23)లో ప్రకటించిన విధంగా, కేంద్ర ప్రభుత్వం తన మొత్తం మార్కెట్ రుణాలలో భాగంగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వనరులను సమీకరించడానికి సావరిన్ గ్రీన్ బాండ్లను జారీ చేస్తుంది. -
రేపటి నుంచి గోల్డ్ బాండ్లు
గ్రాము ధర రూ. 2,684 చొప్పున జారీ ఈ నెల 20 వరకూ కొనుగోలు చేయొచ్చు... 26న కొనుగోలుదార్ల చేతికి బాండ్లు.. రిజర్వ్ బ్యాంక్ ప్రకటన న్యూఢిల్లీ: బంగారం సావరిన్ బాండ్లను గురువారం నుంచి జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. జారీ ధరను గ్రాముకు రూ.2,684గా నిర్ణయించింది. గతనెల 26 నుంచి 30వ తేదీ వరకూ ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించిన 999 ప్యూరిటీ గోల్డ్ ముగింపు ధర సగటును ఆధారంగా చేసుకుని జారీ ధరను నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ... పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన ఈ బాండ్లపై కేంద్రం ప్రకటించిన 2.75 శాతం వార్షిక వడ్డీ కూడా ఉంటుందని తెలియజేసింది. నిజానికి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేని వారు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది తొలివిడత మాత్రమేనని, తదుపరి దశల్లో కూడా బాండ్ల జారీ ఉంటుందని ఆర్బీఐ తెలియజేసింది. ఇవీ ముఖ్యాంశాలు.. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ బ్యాంకులు, నిర్దిష్ట పోస్టాఫీసుల్లో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. కొన్నవారికి 26న బాండ్లు జారీ అవుతాయి.కనీసం 2 గ్రాములు కొనాలి. గరిష్టంగా ఒక వ్యక్తి, ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రా. మాత్రమే కొనే వీలుంటుంది. అయితే జాయింట్ హోల్డర్లయితే మొదటి వ్యక్తికి ఈ పరిమితి వర్తిస్తుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత విక్రయించి ‘ఎగ్జిట్’ కావచ్చు. విక్రయించడానికి ముందు వారం (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) భారత బులియన్ అండ్ జువెల్లర్స్ అసో సియేషన్ ప్రకటించిన 999 ప్యూరిటీ పసిడి ధర సగటును ధరగా నిర్ణయిస్తారు. కాలపరిమితి తరవాత బాండ్లను నగదుగా మార్చుకునేటపుడు కూడా (రిడంప్షన్) ధరను ఇలాగే నిర్ణయిస్తారు. ఐదేళ్లకు ముందే ఎగ్జిట్ కావాలనుకునే వారి సౌలభ్యం కోసం కమోడిటీ ఎక్స్ఛేంజీలలో ఈ బాండ్ల ట్రేడింగ్ జరుగుతుంది.భారతీయులు సహా భారతీయ సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టీలు, యూనివర్శిటీలు, దాతృత్వ సంస్థలు మాత్రమే బాండ్ల కొనుగోలు అర్హతను కలిగి ఉంటాయి.రుణాలకు హామీగా కూడా బాండ్లను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పసిడిపై ఇస్తున్న రుణానికి సంబంధించి ఆర్బీఐ విధిస్తున్న నిబంధనలే దీనికీ వర్తిస్తాయి.ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ తరహాలోనే కేపిటల్ గెయిన్ ట్యాక్స్ అమలవుతుంది. బాండ్ల పంపిణీపై కమిషన్ ‘సబ్స్క్రిప్షన్ విలువ’పై ఒక శాతంగా ఉంటుంది. ఇదీ... ప్రభుత్వ లక్ష్యం దేశంలో ఏటా దాదాపు 1,000 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దీనితో దేశంలోకి ఫారెక్స్ రాకపోకలకు సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు తీవ్ర మయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీటిని నివారించటమే గోల్డ్ బాండ్ జారీ లక్ష్యం. ఈ తరహా సావరన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ఆరంభిస్తామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ 2015-16 బడ్జెట్లో ప్రకటించారు. ‘ఇండియా గోల్డ్ కాయిన్లు’ కూడా.. న్యూఢిల్లీ: పండుగ సీజన్లో బంగారానికి డిమాండ్ ఉండే నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం.. గోల్డ్ డిపాజిట్ స్కీము, బాండ్ల పథకాలతో పాటు దేశీయంగా తొలి ‘ఇండియా గోల్డ్ కాయిన్’లను ఆవిష్కరించనున్నారు. ఇవి ప్రాథమికంగా 5,10 గ్రాముల పరిమాణంలో లభ్యమవుతాయి. 20 గ్రాముల పరిమాణంతో కడ్డీల రూపంలోనూ లభిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఎంఎంటీసీ అవుట్ లెట్స్లో 5 గ్రాముల నాణేలు 15,000.. 10 గ్రా. నాణేలు 20,000, కడ్డీలు 3,750 అందుబాటులో ఉంటాయని వివరించింది. నకిలీల తయారీకి ఆస్కారం ఉండని విధంగా అశోక చక్ర ముద్రతో కూడిన నాణేలను రూపొందించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బంగారం డిపాజిట్ స్కీముకు సంబంధించి వడ్డీ రేటు మధ్యకాలిక డిపాజిట్లపై (5-7 ఏళ్లు) 2.25%గాను, దీర్ఘకాలిక డిపాజిట్లపై (12-15 ఏళ్ల వ్యవధి) 2.50%గా ఉంటుందని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ కాలావధి గల డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులు స్వీకరిస్తాయని పేర్కొంది. 22 క్యారట్ల స్వచ్ఛత గల బంగారాన్ని కనిష్టంగా 30 గ్రాములు డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. గోల్డ్ ఈటీఎఫ్ల ట్రేడింగ్ పొడిగింపు ధన త్రయోదశి రోజున రాత్రి 7 గం. వరకూ ట్రేడింగ్ సెషన్ న్యూఢిల్లీ: ధన త్రయోదశి (ఈ నెల 9వ తేదీ-సోమవారం) సందర్భంగా గోల్డ్ ఈటీఎఫ్(ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) ట్రేడింగ్ సెషన్ను ఎన్ఎస్ఈ ఏడు గంటల వరకూ పొడిగించింది. ఈ పొడిగింపు గోల్డ్ ఈటీఎఫ్లకు మాత్రమే వర్తిస్తుందని ఎన్ఎస్ఈ పేర్కొంది. సాధారణంగా ట్రేడింగ్ సెషన్ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 3.30 వరకూ ఉంటుంది. అయితే ధన త్రయోదశి రోజు మాత్రం గోల్డ్ ఈటీఎఫ్ల ట్రేడింగ్ మళ్లీ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతుందని తెలియజేసింది. బీఎస్ఈ కూడా గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడింగ్ సెషన్ను రాత్రి 7 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారమే వెల్లడించింది. విజయవంతమవుతుంది: ఇండియా రేటింగ్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ బార్స్ వంటి పెట్టుబడి సాధనాలతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ (ఎస్జీబీఎస్) ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ముందుంటుందని ఇండియా రేటింగ్ పేర్కొంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మాదిరిగానే గోల్డ్ బాండ్ల స్కీమ్ అమలు కూడా సులభంగా ఉంటుందని తెలిపింది. గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రారంభం వల్ల బంగారు ఆభరణాల తయారీకి ఫిజికల్ గోల్డ్ను, పెట్టుబడి కోసం గోల్డ్ బాండ్లను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని తెలియజేసింది. నిల్వ, నిర్వహణ వ్యయాలు, నాణ్యత పరిశీలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... గోల్డ్ బార్స్, నాణేలపై పెట్టుబడిపెట్టే ఇన్వెస్టర్లు వారి ప్రాధాన్యాన్ని ఇక గోల్డ్ బాండ్లవైపు మరలిస్తారని అభిప్రాయపడింది.