breaking news
South Korean university
-
తెలుగు ప్రొఫెసర్కు దక్షణ కొరియా బెస్ట్ టీచింగ్ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ కొరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం కోన్కుక్ యూనివర్శిటీ ఇచ్చే ‘బెస్ట్ టీచింగ్ ఎక్సలెన్స్’ అవార్డును 2017 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్కి చెందిన డాక్టర్ కొప్పుల శుశృతకు అందజేశారు. ప్రస్తుతం ఆయన అదే విశ్వవిద్యాలయంలో 2009 నుంచి అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. వర్శిటీలో బుధవారం జరిగిన ప్రత్యేక వేడుకలో ఆయన యూనివర్సీటీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు. 1931లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఓ విదేశీ అధ్యాపకుడికి ఉత్తమ టీచింగ్ అవార్డు రావడం ఇదే తొలిసారి. విజయవాడకు చెందిన డాక్టర్ శుశృత ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ చేశారు. సియోల్ నేషనల్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టర్గా పనిచేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్లోనే ఇది మరుపురాని క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. భారత్, దక్షిణ కొరియాల మధ్య పరిశోధనా సత్సంబంధాలు మరింతగా మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. డాక్టర్ శుశృతను దక్షిణ కొరియా తెలుగు సంఘం ( టీఏఎస్కే) సభ్యులు డాక్టర్ వేణు నూలు, డాక్టర్ అనిల్ కావల, తరుణ్, అంకంరెడ్డి హరినారాయణ, కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
మహాజన్కు ద.కొరియా వర్సిటీ డాక్టరేట్
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు దక్షిణ కొరియాలోని హాంకూక్ విదేశీ వ్యవహారాల విశ్వవిద్యాలయం(హెచ్యూఎఫ్ఎస్) గౌరవ డాక్టరేటును శనివారం ప్రదానం చేసింది. పార్లమెంటేరియన్ల పనిని ప్రజలు అరుదుగా గుర్తిస్తారని, ఈ గౌరవం ప్రత్యేకమైందని మహాజన్ ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం ఆమె నేతృత్వంలోని పార్లమెంటు సభ్యుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని చట్టాలకున్న ఉమ్మడితత్వానికి ఈ డాక్టరేటు చిహ్నంగా నిలుస్తుందని స్పీకర్ను ఉటంకిస్తూ లోక్సభ ప్రకటన జారీ చేసింది. ఈ వర్సిటీ అంతర్జాతీయ అవగాహన పెంపుకు ఎంతో కృషి చేస్తోందని సుమిత్రాప్రశంసించారు.