breaking news
Smart cards issued
-
మత్స్యకారులకు మేలు కలిగేలా స్మార్ట్ కార్డుల జారీ
-
తైవాన్ చిప్ ఆగింది.. వాహనాల ఆర్సీ, లైసెన్స్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఓ చిన్న చిప్ ఇప్పుడు వాహనదారులను హైరానా పెడుతోంది. తైవాన్కు చెందిన ఆ చిప్ ఏకంగా రవాణాశాఖలో ఆర్సీలు, లైసున్సుల జారీ ప్రక్రియనే నిలిపేసింది. నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. రవాణాశాఖ కార్యాలయాల్లో లక్షల్లో కార్డులు పేరు కుపోయాయి. వాటిని పొందాల్సిన వాహనదారు లు, డౌన్లోడ్ చేసుకుని ప్రింట్లు దగ్గరపెట్టు కుని తిరుగుతున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో ఈ ప్రింట్లను పట్టించుకోకపోవడంతో వాహనాలను అనుమతించని పరిస్థితి ఉంది. స్థానికంగా, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా పెనాల్టీలు విధిస్తున్నారు. దీనికంతటికీ.. ఆ కార్డుల్లో ఇమడాల్సిన చిప్లు లేకపోవటమే కారణం. ఇదీ కారణం.. రాష్ట్రంలో పదేళ్లుగా లైసెన్సులు, ఆర్సీ కార్డుల్లో చిప్లను అమర్చుతున్నారు. ఆ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ చిప్లో నిక్షిప్తమై ఉంటాయి. నకిలీ కార్డులను అడ్డుకునేందుకు వీటిని తెచ్చారు. ఈ చిప్ల తయారీ మన దేశంలో నామమాత్రంగానే ఉంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోకతప్పని పరిస్థితి. తైవాన్, ఉక్రెయిన్, చైనా నుంచి అవి దిగుమతి అవుతున్నాయి. ఇటీవల చైనాతో సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో అక్కడి దిగుమతులను కేంద్రప్రభుత్వం నిషేధించింది. ఇక యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి కూడా వాటి దిగుమతి ఆగిపోయింది. మిగిలింది తైవాన్. రెండు దేశాల నుంచి దిగుమతి ఆగిపోయేసరికి తైవాన్పై భారం పడింది. సరిపడా చిప్లను ఆ దేశం అందించలేకపోతోంది. ఇటీవల స్థానికంగా వాటి డిమాండ్ పెరగడం, ఇతర దేశాలకు ఎక్కువ మొత్తంలో సరఫరా చేయాల్సి రావడంతో తైవాన్ కూడా చేతులెత్తేసింది. దీంతో చిప్లకు తీవ్ర కొరత ఏర్పడి స్మార్ట్ కార్డుల తయారీ నిలిచిపోయింది. మళ్లీ సాధారణ కార్డులు ఇప్పుడు చిప్లకు తీవ్ర కొరత రావటంతో మళ్లీ పాతపద్ధతిలో అవి లేకుండానే కార్డులు ప్రింట్ చేయాలని రవాణాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. ఈమేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా రావటంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్కార్డుల కోసం జనం రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవ్యాలెట్లో డౌన్లోడ్ చేసుకుని తనిఖీలప్పుడు చూపమని అధికారులు సలహా ఇస్తున్నారు. కానీ కొన్ని చోట్ల స్మార్ట్ కార్డు లేకుంటే పోలీసులు పెనాల్టీలు విధిస్తున్నట్టు వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా రవాణాశాఖ సరీ్వస్ చార్జీ విధిస్తుంది. కార్లకు రూ.450, ద్విచక్రవాహనాలకు రూ.300 చొప్పున వసూలు చేస్తోంది. కానీ, కార్డుల జారీలో అవాంతరాలున్నాయన్న సమాచారాన్ని కనీసం వారికి ఎస్ఎంఎస్ రూపంలో కూడా పంపడం లేదు. ఇది దారుణం ‘స్మార్ట్ కార్డుల జారీ నిలిచిపోయినా వాహనదారులకు సమాచారం ఇవ్వడం లేదు. కనీసం నోటీసు బోర్డుల్లోనూ పెట్టలేదు. పత్రికా ముఖంగా కూడా తెలపలేదు. రవాణాశాఖ సర్వీస్ చార్జీ వసూలు చేస్తూ కూడా ఇలా చేయటం దారుణం. దీనిపై వెంటనే పూర్తి వివరాలను వెల్లడించాలి. – దయానంద్, తెలంగాణ ఆటో మోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
'కార్మికులకు స్మార్ట్ కార్డులు'
భువనగిరి: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లాలో మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో కార్మికులకు స్మార్టు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రై వేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు గుర్తింపు సంఖ్యను అందజేసి, వారిని సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా చేస్తామన్నారు. కేంద్ర కార్మిక శాఖలోని రూ.27 వేల కోట్ల నిధులను రెండు నెలల్లోనే అన్ని రంగాల కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీడీ కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పారు. అలాగే, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తమని పేర్కొన్నారు. అనంతరం ఆయన భువనగిరి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. -
భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ పథకంలో రాష్ట్రీయ పాస్ట్ బీమా, ఆమ్ ఆద్మీ బీమా యోజన, వృద్ధాప్య పింఛన్ తదితర మూడు అంశాలను పొందుపరుస్తామన్నారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మోడల్ ఐటీఐగా తీర్చిదిద్దేందుకు మల్లేపల్లిలోని ఐటీఐకి రూ.10 కోట్లు కేటాయించినట్టు చెప్పా రు. శ్రామికుల నైపుణ్యాన్ని పెంచేందుకు హైదరాబాద్కు దగ్గరలో వృత్తి విద్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి నాయిని మాట్లాడుతూ కార్మికుల డబ్బులు దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.600 కోట్లు రావాల్సి ఉందన్నారు. రూ.420 కోట్లను ఏపీ సీఎం చంద్రబాబు అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్టు చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామల్ల ఐలయ్య, అధ్యక్షులు కాలేబు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాములు, కోశాధికారి లక్ష్మయ్య, కార్యదర్శి అల్వాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.